News March 25, 2025
కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా కొట్టాలకు చెందిన బోదాటి సాయవ్వ(43) రైలు దిగి రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Similar News
News December 7, 2025
పెద్దపల్లి: 851 వార్డుల్లో పోలింగ్

గ్రామ పంచాయతీ మూడో దశ వార్డు ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. పెద్దపల్లి జిల్లాలోని 4 మండలాల్లో ఉన్న 852 వార్డులలో కేవలం ఒక్క వార్డులో మినహా, మిగిలిన 851 వార్డులు పోలింగ్కు వెళ్లనున్నాయి. ఎలిగేడులో 269, ఓదెలలో 467, పెద్దపల్లిలో 712, సుల్తానాబాద్లో 566 చొప్పున కలిపి మొత్తం 2,014 వార్డ్ మెంబర్ నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు జిల్లా పంచాయతీ అధికారి ప్రకటించారు.
News December 7, 2025
ప.గో: YCPకి జిల్లా కీలక నేత రాజీనామా..!

తాడేపల్లిగూడెంకు చెందిన వైసీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు తెన్నేటి జగ్జీవన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడికి రాజీనామా లేఖ పంపినట్లు జగ్జీవన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కాలంలో వైసీపీలో నెలకొన్న పరిణామాలు, పార్టీ విధానాలు, గుర్తింపు లేకపోవడం వంటి కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ భవిష్యత్తుపై త్వరలో ఓ నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు.
News December 7, 2025
GVMCలో గ్రామాల విలీనానికి ప్రభుత్వం కసరత్తు..

GVMC విస్తరణకు మరో అడుగు పడింది. భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల్లోని 64 గ్రామ పంచాయతీలు.. పెందుర్తి మండలంలోని 15 గ్రామ పంచాయతీలను GVMCలో విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. దీనికి సాధ్యాసాధ్యాలు పరిశీలించి నివేదిక ఇవ్వాలని మున్సిపల్ వ్యవహారాల విభాగాన్ని పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ ఆదేశించింది. ఈ గ్రామాలన్నీ విలీనం అయితే జిల్లా మొత్తం GVMC పరిధిలోకి వెళ్లిపోతుంది.


