News October 11, 2024
కామారెడ్డి: లింగ నిర్దారణ టెస్టులు చేస్తున్న ముఠా అరెస్ట్

లింగ నిర్దారణ టెస్టులు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి SP సింధు శర్మ శుక్రవారం తెలిపారు. రాజంపేట్ వాసి రవీందర్ తన ఇంటి వద్ద అక్రమంగా లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్నాడని సమాచారం అందడంతో పోలీసులు సోదాలు నిర్వహించారన్నారు. 14 మందిని నేరస్థులుగా గుర్తించారు. 5 గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. మరో 9 మందిని త్వరలో పట్టుకొని అరెస్ట్ చేస్తామని SP తెలిపారు.
Similar News
News December 20, 2025
NZB: ఎల్లుండి నుంచి యథావిధిగా ప్రజావాణి: కలెక్టర్

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 22 (సోమవారం) నుంచి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ప్రజావాణి కార్యక్రమం తిరిగి యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు.
News December 20, 2025
NZB: లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా జడ్జి

జిల్లాలోని కోర్టుల్లో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని NZB జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మి సూచించారు. ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. నిజామాబాద్లో 9, బోధన్లో 4, ఆర్మూర్లో 2 బెంచ్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సాయిసుధ పాల్గొన్నారు.
News December 20, 2025
ఇందూరు: పెరిగిన ఉష్ణోగ్రతలు.. తగ్గని చలి

నిజామాబాద్ జిల్లాలో 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా కనిష్ఠంగా 16.1 డిగ్రీల సెల్సియస్, గరిష్ఠంగా 30.7 డిగ్రీలు సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యాయి. చలివాతావరణం కొనసాగుతుండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం, రాత్రి వేళల్లో చలి ప్రభావం ఉంది. వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.


