News January 31, 2025
కామారెడ్డి: వచ్చే నెల 1 న జాబ్ మేళా

కామారెడ్డి జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో వచ్చే నెల 1న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మధు సూధన్ రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కామారెడ్డిలోని ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, SSC ఆపై చదివిన 18 నుంచి 30 ఏళ్ల లోపు వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.
Similar News
News December 13, 2025
గుమ్మం ముందు కూర్చొని ఈ పనులు చేస్తున్నారా?

ఇంటి గుమ్మంపై కూర్చోవడం, జుట్టు దువ్వడం, తినడం, అడుగు పెట్టడం వంటి పనులు చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. ఇది లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్లు అవుతుందని అంటున్నారు. అలాగే తలుపు దగ్గర ఓ కాలు లోపల, మరో కాలు బయట పెట్టి నిలబడటం కూడా మంచిది కాదని చెబుతున్నారు. గుమ్మాన్ని కూడా దైవంలా భావించాలని, పూజించాలని ఫలితంగా శుభం కలుగుతుందని వివరిస్తున్నారు. SHARE IT
News December 13, 2025
14 నుంచి తిరుపతి ఐఐటీలో ఇంటర్ స్పోర్ట్స్

ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి IITలో 58వ ఇంటర్ స్పోర్ట్స్ మీట్ 14వ తేదీ నుంచి 21 తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐఐటీ నుంచి ఓ ప్రకటన విడుదలైంది. చెస్, టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇండియన్ ఐకాన్ వెయిట్ లిఫ్టర్ సతీష్ శివలింగం హాజరుకానున్నారు.
News December 13, 2025
రానున్న 3 రోజులు జాగ్రత్త!

TG: రాష్ట్రంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నిన్న 28 జిల్లాల్లో సింగిల్ డిజిట్, 5 జిల్లాల్లో 12 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి (D) కోహిర్లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత 5.8°C నమోదైంది. సంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్ జిల్లాల్లో చలి ప్రభావం తీవ్రంగా ఉంటోంది. రానున్న 3 రోజులు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది.


