News February 2, 2025

కామారెడ్డి: వెటర్నియన్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

image

తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటర్నియన్స్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పోచయ్య, కార్యదర్శిగా బి.కొండల్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు ఎల్.ప్రేమ్ సింగ్, కోశాధికారిగా ఎన్.నితిన్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులందరికీ పశుసంవర్ధక శాఖ అధికారులు అభినందనలు తెలిపారు.

Similar News

News March 12, 2025

భీమవరం పట్టణంలో బాంబు బెదిరింపు కలకలం

image

భీమవరం పట్టణంలో శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీలోని డెంటల్ కళాశాలకు బుధవారం మధ్యాహ్నం మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీనితో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కాలేజ్ యాజమాన్యం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వెంటనే బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహిస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 12, 2025

ఝట్కా, హలాల్‌ మటన్‌కు తేడా ఏంటి?

image

మహారాష్ట్రలో మల్హర్ సర్టిఫికేషన్ నేపథ్యంలో ఝట్కా, హలాల్ విధానాలపై SMలో చర్చ జరుగుతోంది. మొఘలులకు పూర్వం దేశంలో ఝట్కా విధానమే పాటించేవారు. జీవికి సునాయాస మరణం ప్రసాదించడమే దీని ప్రధాన ఉద్దేశం. అంటే ఒక్క వేటుతో మెడను వేరు చేస్తారు. దీనివల్ల చెడు హార్మోన్లు ఉత్పత్తి అవ్వవని, మాంసం ఫ్రెష్‌గా ఉంటుందని చెప్తారు. అలాగే మనిషి లాలాజలంతో కలుషితం అవ్వదంటారు. హలాల్‌ ప్రక్రియ ఇందుకు భిన్నంగా ఉంటుంది.

News March 12, 2025

NZB: ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

image

నిజామాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారుల బృందం బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి తనిఖీలు చేపడుతోంది. ప్రధాన గేటుకు తాళం వేసి సోదాలు చేస్తున్నారు. పలువురు ఏజెంట్లు లోపల ఉండగా ఈ దాడి జరిగింది. కాగా ఈ కార్యాలయం పరిధిలో పలువురు అధికారులు ఏజెంట్ల ద్వారా పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలోనే ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో సోదాలు జరుపుతున్నట్లు తెలిసింది.

error: Content is protected !!