News February 25, 2025
కామారెడ్డి: వేములవాడకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

మహా శివరాత్రి పండగ సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజినల్ మేనేజర్ జ్యోష్నా సోమవారం తెలిపారు. 25, 26, 27 తేదీల్లో నిజామాబాద్ నుంచి వేములవాడకు పెద్దలకు రూ.270, పిల్లలకు రూ.150 టికెట్ ధరతో.. ఆర్మూర్ నుంచి రూ.220 పెద్దలకు, రూ.120 పిల్లలకు, కామారెడ్డి నుంచి పెద్దలకు రూ.140, పిల్లలకు రూ.80 టికెట్ ధర ఉంటుందన్నారు.
Similar News
News December 5, 2025
పుతిన్కు భగవద్గీత ప్రతిని ప్రజెంట్ చేసిన మోదీ

భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్కు ప్రధాని మోదీ భగవద్గీత ప్రతిని ప్రజెంట్ చేశారు. ఈ సందర్భంగా గీత బోధనలు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఈ సాయంత్రం భారత్కు చేరుకున్న పుతిన్కు మోదీ ఘనస్వాగతం పలికారు. ఆపై ఢిల్లీ లోక్కళ్యాణ్ మార్గ్లో ఉన్న PM అధికారిక నివాసంలో ఇద్దరు నేతలు డిన్నర్లో పాల్గొన్నారు.
News December 5, 2025
జనరల్ ఆసుపత్రులలో ST సెల్ ఏర్పాటు చేయాలని వినతి

కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం జిల్లా ప్రధాన ఆసుపత్రుల్లో ST సెల్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జిరెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. అమరావతి సచివాలయంలో గురువారం ఆయనను కలసి ఆసుపత్రుల్లో వైద్యం కోసం గిరిజనులు పడుతున్న ఇబ్బందులను తెలిపానని బొజ్జిరెడ్డి మీడియాకు తెలిపారు. ఏజెన్సీ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రాథమిక వైద్యం అందించేందుకు హెల్త్ అసిస్టెంట్లన నియమించాలన్నారు.
News December 5, 2025
భద్రాద్రి: ‘ఎన్నికల నియమావళి పక్కాగా అమలు చేయాలి’

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను సాధారణ పరిశీలకులు వి. సర్వేశ్వర రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి తహశీల్దార్లు, ఎంపీడీఓ, ఏఓ, ఏఈఓ, పోలీస్ శాఖ, ఎన్నికల అధికారులతో వీసీ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు లావణ్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ CEO నాగలక్ష్మి ఉన్నారు.


