News February 25, 2025

కామారెడ్డి: వేములవాడకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

image

మహా శివరాత్రి పండగ సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజినల్ మేనేజర్ జ్యోష్నా సోమవారం తెలిపారు. 25, 26, 27 తేదీల్లో నిజామాబాద్ నుంచి వేములవాడకు పెద్దలకు రూ.270, పిల్లలకు రూ.150 టికెట్ ధరతో.. ఆర్మూర్ నుంచి రూ.220 పెద్దలకు, రూ.120 పిల్లలకు, కామారెడ్డి నుంచి పెద్దలకు రూ.140, పిల్లలకు రూ.80 టికెట్ ధర ఉంటుందన్నారు. 

Similar News

News March 25, 2025

పిల్లల్లో కంటి చూపు సమస్యలు.. నివారణ ఇలా

image

చాలా మందికి చిన్నతనంలోనే కంటి చూపు సమస్యలొస్తున్నాయి. ఎక్కువ స్క్రీన్ టైమ్, లో లైట్‌లో చదవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటివి దీనికి కారణాలు. ఈ సమస్య పోయి కంటిచూపు మెరుగుపడాలంటే స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడంతో పాటు సహజ కాంతి, పచ్చని వాతావరణంలో ఆడుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం (క్యారెట్, పాలకూర, టమాట, బాదం, వాల్‌నట్స్), కంటి వ్యాయామాలు, రోజూ 8-10hrs నిద్రపోవడం వంటివి పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

News March 25, 2025

ADB: అక్రెడిటేషన్ గడువు పొడగింపు

image

మీడియా అక్రెడిటేషన్ కార్డుల గడువు ఈనెల 31 వరకు ముగియనున్న నేపథ్యంలో వాటి గడువు మరో మూడు నెలలు పొడగించినట్లు ఆదిలాబాద్ పౌర సంబంధాల అధికారిణి తిరుమల పేర్కొన్నారు. గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. జిల్లాలోని పాత్రికేయుంతా మంగళవారం నుండి అక్రెడిటేషన్ కార్డ్స్ పై స్థిక్కర్లు వేయించుకోవాలి కోరారు.

News March 25, 2025

BSNL యూజర్లకు అలర్ట్

image

కేవైసీ కంప్లీట్ చేయకపోతే 24 గంటల్లో సిమ్ బ్లాక్ అవుతుందని నోటీసులు వస్తే స్పందించవద్దని యూజర్లకు BSNL సూచించింది. ఇటీవల పలువురు యూజర్లకు ఇలాంటి నోటీసులు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని, కానీ తాము ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని స్పష్టం చేసింది. స్కామర్లు KYC పేరిట యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని తెలిపింది. వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

error: Content is protected !!