News April 3, 2025

కామారెడ్డి: శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: DEO

image

ఇటీవల ప్రమోషన్ పొందిన GHM, PSHM, SAలకు నిజామాబాద్‌లో శిక్షణ ఉంటుందని DEO రాజు తెలిపారు. ఈ నెల 3న SA (తెలుగు), 4న SA(హిందీ) టీచర్లకు కామారెడ్డి ZPHS బాయ్స్, కృష్ణాజివాడి ZPHSలో శిక్షణ ఉంటుందన్నారు. అలాగే SA (ఉర్దూ) మీడియం టీచర్లకు హైదరాబాద్ TGIRDలో మిగతా ఉర్దూ మీడియం సబ్జెక్ట్స్ టీచర్లకు నిజామాబాద్‌లో శిక్షణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని DEO సూచించారు.

Similar News

News December 19, 2025

TU: డిగ్రీ విద్యార్థులకు వన్ టైమ్ ఛాన్స్ ఎగ్జామ్స్

image

టీయూ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు వన్ టైమ్ ఎగ్జామ్స్ ఛాన్స్ ఇచ్చినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. 2016 నుంచి 2020 వరకు విద్యనభ్యసించిన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ తదితర కోర్సుల విద్యార్థులు 1,2,3,4,5,6 సెమిస్టర్ పరీక్షలు రాసుకోవచ్చు అని వెల్లడించారు. జనవరి 3 లోపు ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ సందర్శించాలన్నారు.

News December 19, 2025

కడపలో వారి గన్ లైసెన్సుల రద్దు..!

image

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కడప జిల్లాలోని గన్ లైసెన్స్‌లపై దృష్టి సారించారు. లైసెన్స్ పొందిన వారి గురించి ఆరా తీస్తున్నారు. వారిపై కేసుల వివరాలు, నేర చరిత్రను పరిశీలిస్తున్నారు. జిల్లాలో సుమారు 850 దాకా గన్ లైసెన్స్‌లు ఉన్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ సమస్యలు సృష్టించే వారి గన్ లైసెన్స్ రద్దుకు సిఫారసు చేయనున్నారు.

News December 19, 2025

విజయవాడలో హత్యకు గురైన నర్సీపట్నం వాసి

image

నర్సీపట్నం మండలం నీలంపేట గ్రామానికి చెందిన పలక తాతాజీ విజయవాడలో గురువారం అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. అతని కుమారుడు శ్రీను తెలిపిన వివరాల ప్రకారం.. కూలి పనికి వెళ్లిన తాతాజీ ఇంటికి రాలేదు. స్నేహితులతో కలిసి గాలించగా చిట్టినగర్ స్వరంగం ప్రాంతం వద్ద రక్తపు మడుగుల్లో, కత్తిగాట్లుతో మృతి చెంది ఉన్నాడు. తండ్రి అనుమానాస్పద మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నాడు.