News February 25, 2025

కామారెడ్డి: శీనన్న కష్టపడి పని చేయండి: CM

image

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం నిజామాబాద్‌కు సీఎంను ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు చర్చించుకున్నారు. సీఎం రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీపై ఎంతైనా ఉందని చెప్పారు. ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని సూచించారన్నారని తెలిపారు. 

Similar News

News November 9, 2025

దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణమా?

image

ఖమ్మం: ఏదులాపురం మున్సిపాలిటీ ముత్తగూడెం మరోసారి హత్యతో ఉలిక్కిపడింది. వారం కింద మహిళ హత్య ఘటన మరువకముందే, శనివారం బుర్రా శ్రీనివాసరావు(45) మృతదేహం సాగర్ కాల్వలో లభ్యం కావడం కలకలం సృష్టించింది. ఈ నెల 6న విధులు ముగించుకొని వస్తున్న శ్రీనివాసరావును, వరుసకు సోదరుడైన వ్యక్తి కిడ్నాప్ చేసి, హత్య చేసి ఉంటారని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఈ ఘాతుకం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

News November 9, 2025

పోచంపల్లి: రెండు రోజుల వ్యవధిలో తండ్రీకొడుకుల మృతి

image

పోచంపల్లి మండలం జలాల్ పురంలో విషాదం జరిగింది. కొడుకు అంతక్రియలు నిర్వహించిన మూడో రోజే తండ్రి చనిపోయారు. గ్రామానికి చెందిన మహేందర్ గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ ఈనెల ఆరో తేదీన చనిపోయాడు. తండ్రి గడ్డం ప్రభాకర్ గతనెల 30న వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా కోతులు అడ్డుపడడంతో స్కూటీపై కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం తగలడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు.

News November 9, 2025

శ్రీకాకుళం: రేపు సెలవు ఇవ్వాలని డిమాండ్

image

ఏటా కార్తీక మాసం 3వ సోమవారం సెలవు ఇస్తారని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(DTF) శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిప్రసన్న, కృష్ణారావు చెప్పారు. కానీ రేపటి నుంచి జిల్లాలో అసెస్‌మెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లకు స్థానిక సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారిద్దరూ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.