News February 25, 2025

కామారెడ్డి: శీనన్న కష్టపడి పని చేయండి: CM

image

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం నిజామాబాద్‌కు సీఎంను ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు చర్చించుకున్నారు. సీఎం రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీపై ఎంతైనా ఉందని చెప్పారు. ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని సూచించారన్నారని తెలిపారు. 

Similar News

News December 6, 2025

మహబూబాబాద్: మూడో విడతలో సర్పంచ్‌కు 1,185 నామినేషన్లు

image

మూడో విడత ఎన్నికల్లో డోర్నకల్, గంగారం కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరోల్ మండలాల్లో 169 గ్రామ పంచాయతీల్లో 1,412 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 3వ రోజు నామినేషన్లు ముగిశాయి. సర్పంచ్‌కు 1,185, స్థానాలకు నామినేషన్లు, వార్డు స్థానాలకు 3,592 నామినేషన్‌లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఉపసంహరణ, స్క్రూటీని అనంతరం ఈ నెల 17న ఎన్నికలు జరగనున్నాయి.

News December 6, 2025

మర్రిగూడ: పట్టుబడుతున్నా మారట్లేదు

image

మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారిందన్న చర్చ నడుస్తోంది. గతంలో పనిచేసిన తహశీల్దార్లు మహేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ చంద్రశేఖర్, సర్వేయర్ రవి నాయక్ పలువురి వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ ఏసీబీకి పట్టుబడడం మండలంలో చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా అధికారులు తమ తీరు మార్చుకుని సక్రమంగా విధులు నిర్వహించి మర్రిగూడకు మంచి పేరు తీసుకురావాలని మండల ప్రజలు కోరుతున్నారు.

News December 6, 2025

ఖర్చు ఎంతైనా వెనకాడని అభ్యర్థులు..

image

పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు స్థాయికి మించి ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు. కొందరు భూమలను, బంగారం సైతం తాకట్టు పెడుతున్నారు. ASF జిల్లాలో చిన్న పంచాయతీల్లో సైతం ఒక్కో అభ్యర్థి రూ.15 నుంచి25 లక్షలు ఖర్చు చేసే పరిస్థితి నెలకొంది. పెద్ద జీపీల్లో రూ.20 నుంచి రూ.30 లక్షల దాకా ఖర్చు చేయడానికి వెనకాడడం లేదు. కొందరు ప్రచారంలో పాల్గొనే వారికి రోజుకు రూ.500 చొప్పున కూలి కట్టి ఇస్తున్నారు.