News February 25, 2025

కామారెడ్డి: శీనన్న కష్టపడి పని చేయండి: CM

image

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం నిజామాబాద్‌కు సీఎంను ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు చర్చించుకున్నారు. సీఎం రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీపై ఎంతైనా ఉందని చెప్పారు. ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని సూచించారన్నారని తెలిపారు. 

Similar News

News November 28, 2025

వేములవాడ పోలీసుల అదుపులో నిందితుడు సంతోశ్..!

image

మాజీ నక్సలైట్ బల్లెపు నర్సయ్య అలియాస్ సిద్ధయ్య హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న జక్కుల సంతోశ్ వేములవాడ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. తాను అజ్ఞాతంలో ఉండగా ఎందరినో చంపినట్లుగా నర్సయ్య ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పేర్లతో సహా చెప్పడంతో తన తండ్రిని నర్సయ్య చంపినట్లుగా నిర్ధారణకు వచ్చిన సంతోశ్ యూట్యూబ్ ఛానల్ కోసం ఇంటర్వ్యూ కావాలంటూ నర్సయ్యను పిలిపించి హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.

News November 28, 2025

బాపట్ల: పరీక్షల షెడ్యూల్ రద్దు..!

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 8 నుంచి నిర్వహించాల్సిన పీజీ పరీక్షల షెడ్యూల్‌ను రద్దు చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్ష ఫీజు చెల్లించవచ్చని సూచించారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సూచన మేరకు పీజీ పరీక్షలు జరిగే తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.

News November 28, 2025

జనగామ: నీకు నేను.. నాకు నువ్వు..!

image

కోతులు ఇబ్బంది పెడుతున్నాయంటూ జనగామ జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, మనం ఇబ్బంది పడినట్లుగానే కోతులు కూడా అవస్థలు పడుతున్నాయి. రోజంతా ఆహార సేకరణ కోసం తిరిగి అలిసిపోయిన వానరాలు.. జనగామలోని రైల్వే స్టేషన్‌కి చేరాయి. గోడ పైన సేద తీరుతూ, చలికి వణుకుతూ ‘నీకు నువ్వు.. నాకు నేను’ అన్నట్లుగా ఒక దానికి ఒకటి హత్తుకొని కూర్చున్నాయిలా..