News February 25, 2025
కామారెడ్డి: శీనన్న కష్టపడి పని చేయండి: CM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం నిజామాబాద్కు సీఎంను ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు చర్చించుకున్నారు. సీఎం రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీపై ఎంతైనా ఉందని చెప్పారు. ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని సూచించారన్నారని తెలిపారు.
Similar News
News December 19, 2025
కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఉత్తమ మార్గం: సీపీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కక్షిదారులు ఈ నెల 21న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సీపీ సన్ప్రీత్ సింగ్ కోరారు. క్రిమినల్ కంపౌండబుల్, సివిల్, కుటుంబ తగాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, సమయం, ధనం ఆదా అవుతాయని పేర్కొన్నారు. ఇరు వర్గాల సమ్మతితో కేసులను శాశ్వతంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
News December 19, 2025
అధిక పోషక విలువల మాంసం.. కడక్నాథ్ సొంతం

అత్యంత పోషక విలువల కలిగిన మాంసానికి కడక్నాథ్ కోళ్లు ప్రసిద్ధిచెందాయి. వీటి చర్మం, మాంసం కూడా నలుపు రంగులోనే ఉంటాయి. మధ్యప్రదేశ్లో పుట్టిన ఈ కలమాశి కోడిని కడకనాథ్గా పిలుస్తారు. నాటుకోడితో పోలిస్తే ఈ కోడి మాంసంలో అధిక మాంసకృత్తులు ఉంటాయి. ఈ కోళ్లు 6 నెలల వయసు నుంచే గుడ్లను పెట్టడం ప్రారంభించి ఏటా 100 నుంచి 110 గ్రుడ్లను మాత్రమే పెడతాయి. వీటి గుడ్లకు, మాంసానికి మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది.
News December 19, 2025
NZB: ఆదివారం కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు: TPCC చీఫ్

జాతీయ ఉపాధి హామీ చట్టం పథకంలో మహాత్మా గాంధీ పేరు ను తొలగించి వికసిత్ భారత్ జి.రామ్.జి పేరు తో కొత్త పథకాన్ని తెస్తూ BJP చేస్తున్న కుట్రలను నిరసిస్తూ AICC పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ క్యాడర్ కు పిలుపునిచ్చారు. జిల్లాలో ఆదివారం కార్యకర్తలు, నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు.


