News January 23, 2025
కామారెడ్డి: షబ్బీర్ అలీని కలిసిన ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యం

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కామారెడ్డి పట్టణంలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్య బృందం గురువారం కలిసింది. డిగ్రీ కళాశాలలకు ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బోధన రుసుములను త్వరగా విడుదల చేయాలని కోరారు. దీనిపై షబ్బీర్ అలీ స్పందిస్తూ వీలైనంత త్వరలో పెండింగ్లో ఉన్న బోధన రుసుములను చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయనకు వినతిపత్రం అందజేశారు.
Similar News
News September 15, 2025
రేపు భారీ వర్షాలు

ఏపీలోని కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. కాగా ఇవాళ తూ.గో., ప.గో., కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
News September 15, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి: కలెక్టర్

నిర్మల్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. అలాగే, జిల్లాలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు జరిగే ‘పోషణ్ మా’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రత్యేక పోషకాహార కార్యక్రమాలు నిర్వహించి, ‘ఎనీమియా ముక్త నిర్మల్’ లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
News September 15, 2025
శ్రీశైలంలో కోటి దీపోత్సవం ఎప్పుడంటే?

కార్తీక మాసం మొదలు, పూర్తయ్యే వరకు శ్రీశైలం మల్లికార్జున స్వామి గర్భాలయంలో అభిషేకాలు నిలిపి వేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. కార్తీక మాసంలో వేకువజామున 4:30 గంటల నుంచి దర్శనాలు ప్రారంభిస్తామని చెప్పారు. లడ్డూ ప్రసాదాల విక్రయాల కోసం పది కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. నవంబర్ ఒకటో తేదీన గంగాధర మండపం వద్ద కోటి దీపోత్సవం జరుగుతుందని చెప్పారు.