News February 11, 2025

కామారెడ్డి: సహకార శాఖ జూ.ఇన్స్‌పెక్టర్ మృతి

image

కామారెడ్డి కలెక్టరేట్‌లోని జిల్లా సహకార కార్యాలయంలో జూ.ఇన్స్‌పెక్టర్‌గా విధులు నిర్వహించే రంజిత్ కుమార్(30) అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. వారం రోజుల క్రితం రంజిత్ కుమార్‌కి మెదడులో నొప్పి రావడంతో చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందినట్లు వెల్లడించారు. 

Similar News

News December 10, 2025

TU: ముగిసిన డిగ్రీ పరీక్షలు.. 11 మంది గైర్హాజరు

image

టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో B.A/B.Com/B.SC/BBA/BCA 1, 3, 5 సెమిస్టర్ల రెగ్యులర్, 2, 4, 6 సెమిస్టర్ల బ్యాక్ లాగ్(2021-25) పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. 30 పరీక్షా కేంద్రాల్లో నవంబర్ 20 నుంచి డిసెంబర్ 10 వరకు జరిగాయని వెల్లడించారు. బుధవారం 11 పరీక్షా కేంద్రాల్లో 11 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.

News December 10, 2025

TU: డిగ్రీ పరీక్షలకు 11 మంది గైర్హాజరు

image

టీయూ పరిధిలోని డిగ్రీ-సీబీసీఎస్- I, III ,V సెమిస్టర్ (రెగ్యులర్), II, IV, VI సెమిస్టర్ (2021, 2022, 2023, 2024, 2025 బ్యాచ్‌ల) బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు ఉమ్మడి NZB జిల్లా వ్యాప్తంగా 30 సెంటర్లలో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం 18వ రోజు మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 83 మంది విద్యార్థులకు 72 మంది హాజరయ్యారు. 11 మంది గైర్హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొ.ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.

News December 10, 2025

చిన్నారులకు విటమిన్ డి ఎందుకు అవసరమంటే?

image

పిల్లల ఎముకలు,కండరాల ఆరోగ్యం విషయంలో విటమిన్ D పాత్ర చాలా ముఖ్యమైనది. రోగనిరోధక వ్యవస్థ పనితీరుతో పాటు మొత్తం శరీర ఆరోగ్యంలో D విటమిన్ కీలకపాత్ర పోషిస్తుంది. విటమిన్ D లోపం కారణంగా అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. కీళ్ల నొప్పులు, నిరంతరం అలసట, జుట్టు పల్చబడటం, గాయాలు నెమ్మదిగా మానడం మొదలైనవి విటమిన్ D లోపానికి సంకేతాలు. ఈ లక్షణాలు పిల్లల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి.