News February 11, 2025

కామారెడ్డి: సహకార శాఖ జూ.ఇన్స్‌పెక్టర్ మృతి

image

కామారెడ్డి కలెక్టరేట్‌లోని జిల్లా సహకార కార్యాలయంలో జూ.ఇన్స్‌పెక్టర్‌గా విధులు నిర్వహించే రంజిత్ కుమార్(30) అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. వారం రోజుల క్రితం రంజిత్ కుమార్‌కి మెదడులో నొప్పి రావడంతో చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందినట్లు వెల్లడించారు. 

Similar News

News October 21, 2025

జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

image

గడిచిన 24 గంటల్లో జగిత్యాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. పెగడపల్లిలో అత్యధికంగా 29.3 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. తిరమలాపూర్‌లో 3.8 మిల్లీమీటర్లు, పుడూర్‌లో 3.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాగా, జిల్లాలో పంట పొలాలు చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అటు వాతావరణ కేంద్రం జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే.

News October 21, 2025

మెదక్ యువకుడికి 8 GOVT జాబ్స్

image

పాపన్నపేట(M) పొడ్చన్‌పల్లికి చెందిన అరక అజయ్ కుమార్ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. జ్యోతి, సంజీవరావుల కుమారుడు అజయ్ ఇప్పటివరకు ఏకంగా 8 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. 2018లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శిగా విధుల్లో చేరిన ఆయన.. SCR లోకో పైలట్, కానిస్టేబుల్, ఆర్ఎస్ఐగా ఎంపికయ్యారు. 2023లో SIగా ఎంపిక కాగా, తాజాగా గ్రూప్-2లో ప్రతిభ సాధించి ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగం సాధించారు.

News October 21, 2025

6,27,951 మెట్రిక్ టన్నుల ఇసుక సిద్ధం: కలెక్టర్

image

జిల్లాలో రుతుపవనాల సీజన్‌లో స్టాకు యార్డుల్లో సుమారు 10 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉంచగా, వీటిలో 3,72,431 మెట్రిక్ టన్నులు విక్రయాలు జరిగినట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలోని ఇసుక స్టాక్ యార్డుల్లో 6,27,951 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు సిద్ధంగా ఉన్నట్లు ఆయన మంగళవారం వెల్లడించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుకను సరఫరా చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.