News April 12, 2025

కామారెడ్డి: ‘సిటీ స్కానింగ్ మిషన్ ఏర్పాటు చేయాలి’

image

కామారెడ్డిలో గల 250 పడకల ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ యంత్రం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మంత్రి దమోదర రాజనర్సింహను కోరారు. ఈ మేరకు హైదరాబాదులో మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ యంత్రం లేకపోవడంతో పేద రోగులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

Similar News

News October 13, 2025

MBNR ఇంటర్ విద్యార్థి సూసైడ్

image

మహబూబ్ నగర్ మండలంలోని రామ్ రెడ్డి కూడా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి ప్రియాంక (16) బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియాంక స్వస్థలం గద్వాల జిల్లా మల్దకల్. తనకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదని తల్లిదండ్రులకు చెప్పగా.. సోమవారం వస్తామని చెప్పగా అంతలోనే ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు విలపించారు. చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

News October 13, 2025

సకాలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు- అదనపు కలెక్టర్

image

జిల్లాలో సకాలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కీమ్యా నాయక్ ఆదేశించారు. ప్రభుత్వం వరి ధాన్యం గ్రేడ్-ఎ రకానికి రూ.2,389, కామన్ రకానికి రూ.2,369 మద్దతు ధర కల్పిస్తోందని తెలిపారు. అదేవిధంగా సన్నరకం వరికి రూ.500 బోనస్ ఇస్తుందని చెప్పారు. సీఎంఆర్ ధాన్యాన్ని వేగంగా సమర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News October 13, 2025

PGRS సిబ్బంది పనితీరు మెరుగుపరడాలి: కలెక్టర్

image

కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్, PGRS సిబ్బంది తమ పనితీరు మార్చుకుని ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి, పరిష్కారం అనంతరం ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం అర్జీలు రాయడానికి సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో J.C, DRO, PD, ఇతర అధికారులు పాల్గొన్నారు.