News February 3, 2025

కామారెడ్డి: సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు

image

కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్ సీసీ కెమెరాల నిఘాలో జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 48 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇంటర్మీడియట్ జనరల్ విద్యార్థులు 15,267 మంది, ఒకేషనల్ కోర్సు విద్యార్థులు 3,979 మంది ప్రాక్టికల్స్ కు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లు జరగనున్నాయి.

Similar News

News November 2, 2025

3న కాకినాడలో పీజీఆర్ఎస్

image

కాకినాడ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని ఈ నెల 3న (సోమవారం) కాకినాడ కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌కు అర్జీదారులు హాజరై తమ సమస్యలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.

News November 2, 2025

పర్యాటక ప్రోత్సాహానికి హోమ్ స్టే విధానం: కలెక్టర్

image

పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి, పర్యాటకులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వసతి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం హోమ్ స్టే, బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ విధానాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శనివారం తెలిపారు. హోమ్ స్టేలు ఏర్పాటు చేయాలనుకునే యజమానులు పర్యాటక శాఖ మార్గదర్శకాల ప్రకారం 1 నుంచి 6 గదులు అద్దెకు ఇవ్వవచ్చన్నారు. ఆసక్తి ఉన్న వారు nidhi.tourism.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

News November 2, 2025

4 ప్రాంతాల్లో SIR ప్రీటెస్టు సెన్సస్

image

AP: ECI దేశవ్యాప్తంగా SIR చేపట్టాలని నిర్ణయించడం తెలిసిందే. దీనిలో భాగంగా తొలివిడత ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రీటెస్ట్ నిర్వహించనున్నారు. ఈ ప్రీటెస్టు కోసం ఏపీలో 4 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను ఖరారు చేశారు. అల్లూరి(D) GKవీధి(M), ప్రకాశం(D) పొదిలి(NP), నంద్యాల(D) మహానంది(M), విశాఖ కార్పొరేషన్‌లోని 2, 3 వార్డులను ఎంపిక చేశారు. వీటిలో ప్రీటెస్ట్ నిర్వహణకు ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్లను నియమించారు.