News February 2, 2025
కామారెడ్డి: సూపర్ మార్కెట్ దొంగలు అరెస్టు

కామారెడ్డి పట్టణంలో గత వారం ఓ సూపర్ మార్కెట్లో దొంగతనం కేసులో లంబాడి రాజు, బుట్టరాజు, మెదక్ జిల్లా టేక్మల్కు చెందిన ఇద్దరు పాత నేరస్థులను శనివారం పట్టుకున్నట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. వీరంతా పాత నేరస్థులని.. గతంలో వీరిపై మెదక్, నర్సాపూర్ సంగారెడ్డి పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు.
Similar News
News December 2, 2025
పాలకొల్లు: ఏ తల్లికీ ఇలాంటి కష్టం రాకూడదు.!

పాలకొల్లులో కొడుకు చితికి తల్లి నిప్పు పెట్టిన విషాదకర ఘటన చోటుకుంది. బంగారువారి చెరువు గట్టుకు చెందిన సత్యవాణి కుమారుడు శ్రీనివాస్ తో కలిసి ఉంటోంది. భార్యతో విడాకులు తీసుకొన్న శ్రీనివాస్ మద్యానికి బానిసై అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. అయిన వాళ్లు లేకపోవడంతో తల్లి కైలాస రథంపై హిందూ శ్మశాన వాటికకు మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన చూపరులను కలచివేసింది.
News December 2, 2025
మెదక్: సర్పంచ్ అభ్యర్థి బాండ్ పేపర్ వైరల్

పంచాయతీ పోరులో ఓ సర్పంచ్ అభ్యర్థి తన ఎన్నికల మేనిఫెస్టోను బాండ్ పేపర్పై రాసిచ్చిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. హవేలిఘనపూర్ మం. రాజిపేటతండాకు చెందిన ఓ అభ్యర్థి తానును ఎన్నికల్లో గెలిస్తే గ్రామంలో ఆడపిల్ల పుడితే రూ.2వేలు, అన్ని కులాల పండుగలకు రూ.20వేలు సహా ఇతర హామీలతో బాండ్ పేపర్ రాసిచ్చారు. ఈ హామీలు అమలు చేయకుంటే పదవీ నుంచి తొలగించాలంటూ పేర్కొన్నారు. కాగా ఈ బాండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
News December 2, 2025
అన్నవరం ఆలయానికి ఆరో స్థానం

ఐవీఆర్ఎస్ సర్వేలో అన్నవరం దేవస్థానానికి 6వ స్థానం దక్కింది. రాష్ట్రంలో ఉన్న ప్రధాన ఆలయాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ప్రభుత్వం సర్వే చేసింది. అందులో అన్నవరం ఆలయం 69.7% తో ఆరో స్థానం దక్కించుకుంది. ప్రసాదానికి 77.6% బాగుందని వచ్చింది. శానిటేషన్ విషయంలో 64.2 శాతం మంది మాత్రమే నిర్వహణ బాగుందన్నారు. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 25 వరకు ఈ సర్వే జరిగింది. మరి మన అన్నవరం ఆలయ నిర్వహణపై మీ కామెంట్.


