News January 29, 2025
కామారెడ్డి: ‘హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి’

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయం వద్ద ద్విచక్ర వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెల్మెట్, లైసెన్స్ లేకుండా ఎవరూ వాహనాలు నడిపిన కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రతి ఒకరూ రోడ్డు నిబంధనలు పాటించాలని వివరించారు.
Similar News
News November 25, 2025
సంగారెడ్డి సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు

జిల్లాలోని 613 పంచాయతీలకు అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు. మొత్తం 271 స్థానాలు జనరల్కు కేటాయించగా అందులో 130 మహిళలకు, 141 పురుషులకు కేటాయించారు. బీసీలకు మొత్తం 1117కు పురుషులకు 65, మహిళలకు 52, ఎస్సీలో మొత్తం 126 స్థానాలకు పురుషులకు 70 మహిళలకు 56, ఎస్టీ కేటగిరీలో మొత్తం 18 స్థానాలకు పురుషులకు 12 మహిళలకు 6 స్థానాలు కేటాయించారు.
News November 25, 2025
ఉత్తర తెలంగాణకు రూ.10,000కోట్ల NH ప్రాజెక్టులు

తెలంగాణలో రూ.10,034 కోట్ల అంచనా వ్యయంతో 4 కీలక జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. NH-167(MBNR-గుడెబల్లూర్ -80kms) ₹2,662 కోట్లు, NH-63 (అర్మూర్-జగిత్యాల, 71kms) ₹2,338 కోట్లు, NH-63 (జగిత్యాల-మంచిర్యాల, 68kms) ₹2,550 కోట్లు, NH-563 (JGL-KNR, 59kms)కి ₹2,484 కోట్లతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కొత్త NHలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రవాణా కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తాయి.
News November 25, 2025
VKB: పట్లోళ్ల రఘువీర్ రెడ్డికి డీసీసీ ఇస్తే.. నా పదవికి రాజీనామా చేస్తా!

పట్లోళ్ల రఘువీర్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి ఇస్తే.. తాను తన రాజ్యాంగబద్ధమైన పదవికి రాజీనామా చేస్తానని ఓ ప్రముఖ నాయకుడు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. రఘువీరా రెడ్డికి డీసీసీ పదవి ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వకూడదని ఆయన గట్టిగా సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ వర్గాల్లో ఈ అంశమే ప్రధాన చర్చనీయాంశంగా మారింది.


