News January 22, 2025

కామారెడ్డి: 145 గ్రామ/ 23 వార్డు సభలు జరిగాయి

image

అర్హులైన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ CM బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ నెల 24 వరకు కొనసాగనున్న ప్రజాపాలన గ్రామ సభలపై మంగళవారం రాత్రి బట్టి విక్రమార్క, సీఎస్ శాంతి కుమారితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీసీ ద్వారా సమీక్షించారు. కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ.. జిల్లాలో 145 గ్రామ/ 23 వార్డు సభలు జరిగాయన్నారు.

Similar News

News December 16, 2025

అభివృద్ధి, ఆదాయం పెంపు దిశగా అడుగులు

image

TG: అభివృద్ధి, ఆదాయం పెంపు దిశగా అడుగులేసేందుకు ప్రతి 3నెలలకు GSDPని సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఏడాది చివర్లో కానీ చేయడం లేదు. దీనివల్ల ఆదాయ వృద్ధి, లీకేజీల నివారణకు ఆస్కారం లేకపోతోంది. అటు కేంద్రం, AP త్రైమాసిక రివ్యూలతో ముందుకు వెళ్తున్నాయి. అదే మాదిరి ఇక్కడా అగ్రి, సర్వీస్, ప్రొడక్టివిటీ రంగాలపై సర్కారు దృష్టి పెట్టనుంది. తద్వారా మరింత వృద్ధి సాధ్యమని భావిస్తోంది.

News December 16, 2025

MBNR: 16న..U-19 షటిల్ బ్యాట్మెంటన్ ఎంపికలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-19 బాల, బాలికలకు షటిల్ బ్యాట్మెంటన్ ఎంపికలను ఈనెల 16న మహబూబ్ నగర్ లోని డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్స్ నిర్వహిస్తున్నట్లు SGF కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. క్రీడాకారులు ఒరిజినల్ టెన్త్ మెమో, బోనఫైడ్, ఆధార్ పత్రాలు తీసుకొని ఉదయం 9 గంటలలోపు పీడీ సాదత్ ఖాన్ (89198 71829)కు రిపోర్ట్ చేయాలన్నారు.
SHARE IT.

News December 16, 2025

IPL-2026 అప్‌డేట్

image

IPL 2026 ప్రారంభ తేదీ మారింది. తొలి మ్యాచ్ మార్చి 26న జరగనుందని Cricbuzz వెల్లడించింది. మే 31న ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. కాగా ఇదివరకు మార్చి 15న ఐపీఎల్ ప్రారంభం అవుతుందని నిర్వాహకులు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు రేపు అబుదాబిలో ఐపీఎల్ మినీ వేలం జరగనుంది.