News January 22, 2025
కామారెడ్డి: 145 గ్రామ/ 23 వార్డు సభలు జరిగాయి

అర్హులైన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ CM బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ నెల 24 వరకు కొనసాగనున్న ప్రజాపాలన గ్రామ సభలపై మంగళవారం రాత్రి బట్టి విక్రమార్క, సీఎస్ శాంతి కుమారితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీసీ ద్వారా సమీక్షించారు. కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ.. జిల్లాలో 145 గ్రామ/ 23 వార్డు సభలు జరిగాయన్నారు.
Similar News
News December 21, 2025
గిల్పై వేటు.. సూర్యకూ అల్టిమేటం!

T20ల్లో విఫలమవుతున్న గిల్ను వరల్డ్కప్ నుంచి BCCI <<18622627>>తప్పించిన<<>> విషయం తెలిసిందే. ఈ క్రమంలో రన్స్ చేయలేక తంటాలు పడుతున్న కెప్టెన్ సూర్య కుమార్కూ బోర్డు అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఫామ్ను అందుకోలేకపోతే జట్టులో చోటు కోల్పోవచ్చని హెచ్చరించినట్లు సమాచారం. ‘ఏడాదిగా పరుగులు చేయకున్నా కెప్టెన్ కావడం వల్ల జట్టులో ఉన్నాడు. పరుగులు చేయకపోతే గిల్ మాదిరే సూర్యపై వేటు పడొచ్చు’ అని PTI కథనం పేర్కొంది.
News December 21, 2025
ప్రపంచంలో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు ఇవే.. మనవెక్కడ?

ప్రపంచంలోని బిజీయెస్ట్ రైల్వే స్టేషన్ల లిస్ట్లో జపాన్ టాప్లో ఉంది. టోక్యోలోని ‘షింజుకు’ ఏడాదికి 116 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలతో తొలి స్థానంలో నిలిచింది. టాప్ 10లో ఏకంగా 8 ఆ దేశంలోనే ఉన్నాయి. ఇండియా నుంచి కోల్కతాలోని హౌరా స్టేషన్ 54 కోట్ల మందితో ఆరు, సియాల్దా స్టేషన్ ఎనిమిదో ప్లేస్లో ఉన్నాయి. అధిక జనసాంద్రత, రోజూ ఆఫీసులకు వెళ్లేవారి రద్దీ వల్లే ఈ స్టేషన్లు ఎప్పుడూ కిక్కిరిసిపోతున్నాయి.
News December 21, 2025
చిత్తూరు: ఇళ్ల నిర్మాణానికి భారీగా దరఖాస్తులు

పీఎం ఆవాస యోజనలో భాగంగా పక్కా గృహాల నిర్మాణానికి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. పుంగనూరు నియోజకవర్గంలో 6,485, చిత్తూరులో 1,628, నగరిలో 2,331, పూతలపట్టులో 5,035, జీడీ నెల్లూరులో 5,930, కుప్పంలో 13,657, పలమనేరులో 15,391 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెప్పారు. ఇందులో సుమారు 8వేల మంది ఇంటి స్థలాలను కూడా మంజూరు చేయాలని కోరారు.


