News April 16, 2025

కామారెడ్డి: 18 వరకు రేషన్ బియ్యం పంపిణీ

image

జిల్లా వ్యాప్తంగా ఈ నెల 18 వరకు రేషన్ బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున బాబు తెలిపారు. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ఉచిత సన్న బియ్యం పంపిణీ చేయాలని రేషన్ డీలర్లను ఆయన ఆదేశించారు. ఇప్పటి వరకు సన్న బియ్యం తీసుకొని లబ్ధిదారులను ఈ నెల 18 వరకు రేషన్ షాపులకు వెళ్లి తీసుకోవాలని ఆయన సూచించారు.

Similar News

News November 14, 2025

ప్రొద్దుటూరులో ఎగ్జిబిషన్ GST రూ.15.25 లక్షలు మాయం..!

image

ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ GSTకి సంబంధించిన భారీ నగదు లెక్కల్లో కనిపించడం లేదు. ఈ విషయాన్ని జీఎస్టీ అధికారులు గురువారం గుర్తించారు. 2021లో ఎగ్జిబిషన్‌కు సంబంధించి జీఎస్టీ రూ.15.25 లక్షలుగా నిర్ధారించారు. ఈ సొమ్మును చెల్లించామని మున్సిపల్ అధికారులు చెప్పగా.. ఆ డబ్బులు తమకు జమ కాలేదని GST అధికారులు అంటున్నారు. అసలు గుట్టు తేల్చడానికి జీఎస్టీ అధికారులు ఆడిట్‌కు సిద్ధమయ్యారు.

News November 14, 2025

టీచర్లందరికీ టెట్ కంపల్సరీ.. విద్యాశాఖ ఉత్తర్వులు

image

తెలంగాణలో ఇకపై ఇన్-సర్వీస్ టీచర్లు కూడా <<18277875>>టెట్<<>> క్వాలిఫై అయి ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీచర్లు సర్వీస్‌లో ఉండాలన్నా, ప్రమోషన్లు పొందాలన్నా టెట్ తప్పనిసరి చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విద్యాశాఖ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. 2009 తర్వాత నియమితులైన 30 వేల మంది టీచర్లకు ఈ నిబంధన వర్తించనుంది. రానున్న 2 ఏళ్లలో వీరంతా టెట్ పాస్ కావాలని అధికారులు తెలిపారు.

News November 14, 2025

తెలంగాణ రౌండప్

image

* ఈ నెల 17 నుంచి 22 వరకు సర్కారు స్కూళ్లను తనిఖీ చేయనున్న ఉన్నతాధికారులు.. సేఫ్ అండ్ క్లీన్, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించనున్న స్పెషల్ అధికారులు
* చిన్న చిన్న కారణాలతో 2021 నుంచి తొలగించిన 1,300 మంది ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఎండీ నాగిరెడ్డికి కవిత వినతి
* సమ్మె కారణంగా వాయిదా పడిన ఫార్మసీ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అంగీకారం..