News April 8, 2025
కామారెడ్డి: 2958 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం: కలెక్టర్

కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ.. రబీ సీజన్లో 446 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, 278 కేంద్రాలు త్వరగా ప్రారంభించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, కేంద్రాల్లో టార్పాలిన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు 271 మంది రైతుల నుంచి 2958 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు వెల్లడించారు.
Similar News
News December 10, 2025
గోదావరి గడ్డపై ‘కట్టమంచి’ చెరగని ముద్ర

విద్యా, సాహిత్య రంగాల్లో భీష్మాచార్యులైన కట్టమంచి రామలింగారెడ్డి జయంతి నేడు. గోదావరి జిల్లాలతో ఆయన అనుబంధం చిరస్మరణీయమైనది. ముఖ్యంగా ఏలూరులోని ‘సర్ సి.ఆర్.రెడ్డి కళాశాల’ ఆయన ఖ్యాతికి నిలువుటద్దం. ఆంధ్రా విశ్వవిద్యాలయ వ్యవస్థాపక ఉపాధ్యక్షుడిగా ఈ ప్రాంత విద్యావ్యాప్తికి ఆయన వేసిన బాటలు మరువలేనివి. ఇక్కడి కవులతో ఆయన జరిపిన సాహిత్య గోష్ఠులు చరిత్రలో చెరగని ముద్ర వేశాయి.
News December 10, 2025
కోవూరు: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్లు శిక్ష

కోవూరు పరిధిలో నమోదైన పోక్సో కేస్లో నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.25,000 జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సీపీరెడ్డి సుమ మంగళవారం తీర్పునిచ్చారు. 2021 MAR. 21న మహిళా పోలీస్ స్టేషన్లో కోవూరు(M)నికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన రాయదుర్గం వెంకటేశ్వర్లు అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష ఖరారు చేసింది.
News December 10, 2025
దారిద్ర్య దహన గణపతి స్తోత్రం

సువర్ణ వర్ణ సుందరం సితైక దంత బంధురం
గృహీత పాశ మంకుశం వరప్రదా భయప్రధమ్|
చతుర్భుజం త్రిలోచనం భుజంగ మోపవీతినం
ప్రఫుల్ల వారిజాసనం భజామి సింధురాననమ్||
కిరీట హార కుండలం ప్రదీప్త బాహు భూషణం
ప్రచండ రత్న కంకణం ప్రశోభితాంఘ్రి యష్టికమ్|
ప్రభాత సూర్య సుందరాంబర ద్వయ ప్రధారిణం
సరత్న హేమనూపుర ప్రశోభితాంఘ్రి పంకజమ్||
పూర్తి స్తోత్రం కోసం <


