News March 13, 2025
కామారెడ్డి: 316 మంది గైర్హాజరు

కామారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. గురువారం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ గణితం 1బి, జంతు శాస్త్రం, చరిత్ర పరీక్ష జరిగింది. జనరల్ గ్రూప్కు సంబంధించి 7130 మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. 6915 మంది పరీక్ష రాశారు. ఒకేషనల్ విభాగంలో 1293 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 101 మంది పరీక్షకు దూరంగా ఉన్నారని కామారెడ్డి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు.
Similar News
News December 9, 2025
ఈ కమిషనర్ మాకొద్దు: నరసాపురం కౌన్సిల్ ఫిర్యాదు

నరసాపురం మున్సిపల్ కమిషనర్ అంజయ్యను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని మునిసిపల్ చైర్పర్సన్ బర్రె శ్రీ వెంకట రమణతో పాటు వైసీపీ కౌన్సిల్ సభ్యులు జేసీ రాహుల్ కుమార్ రెడ్డికి PGRSలో ఫిర్యాదు చేశారు. అభివృద్ధి పనులకు కౌన్సిల్ తీర్మానం చేసినా పట్టించుకోవట్లేదని, అవినీతి ఆరోపణలు వంటి కారణాల వల్ల ఆయనను సరెండర్ చేయాలని కౌన్సిల్ తీర్మానించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తీర్మాన పత్రాన్ని జేసీకి అందించారు.
News December 9, 2025
రేపటి నుంచి టెట్ పరీక్షలు: నెల్లూరు DEO

రేపటి నుంచి ఈనెల 21 వరకు టెట్-2025 పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో బాలాజీరావు తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హాల్ టికెట్లు ఆన్లైన్లోనే పొందవచ్చని పరీక్షా కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలని సూచించారు.
News December 9, 2025
తిరుచానూరు అర్చకులు మధ్య ఆధిపత్య పోరు..?

తిరుమల తరువాత తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇలాంటి ఆలయంలో అర్చకుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని సమాచారం. ఆలయంలో అనాధికారిక పరిచారకులను అధికారికంగా చేసుకునే విషయంపై ఓవర్గం వారు విజిలెన్స్ అధికారులకు మరో వర్గం సమాచారం ఇవ్వడంతో విచారణ నడుస్తోందట. మంగళవారం విజిలెన్స్ ఉన్నతాధికారుల నివేదికలో ఏమి తేలుస్తారో చూడాలి.


