News April 12, 2024

కామారెడ్డి: 53 గ్రామాల్లో తాగునీటి సమస్య

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 53 గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పడనున్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో నిజామాబాద్ లో 37, కామారెడ్డిలో 16 ఉన్నాయి. ఇక్కడ చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మిషన్ భగీరథ పథకం అమల్లోకి వచ్చాక బోరుబావులు, చేతి పంపులను పట్టించుకోలేదు. ఇప్పుడు వాటి అవసరాన్ని గుర్తించి పునరుద్ధరించాలని అధికారులు నిర్ణయించారు.

Similar News

News March 17, 2026

NZB: నిరుద్యోగ ఎస్సీ యువతకు స్వయం ఉపాధి పథకాలు

image

ఎస్సీ నిరుద్యోగ యువత నుంచి స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈవీ టూ వీలర్, త్రీ వీలర్, సోలార్ పంపు సెట్ల కోసం మార్చి 17 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒక రేషన్ కార్డుకు ఒకరు మాత్రమే అర్హులన్నారు. వార్షిక ఆదాయం గ్రామీణులకు రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలకు మించకూడదన్నారు. https://tgobmms.cgg.gov.in సందర్శించాలన్నారు.

News March 17, 2026

NZB: ఏప్రిల్ 2న జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సభల నిర్వహణ: కలెక్టర్

image

ఏప్రిల్ 2న జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపల్ పట్టణాల్లో వార్డు సభలు విధిగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా ఉదయం 8 గంటలకు సభలు ప్రారంభం అయ్యేలా చూడాలని, షామియానాలు, తాగునీరు సదుపాయాలు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల వివరాలను గ్రామ, వార్డుల వారీగా సభలలో వెల్లడించాలని తెలిపారు.

News March 17, 2026

NZB: ఏప్రిల్ 2న జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సభల నిర్వహణ: కలెక్టర్

image

ఏప్రిల్ 2న జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపల్ పట్టణాల్లో వార్డు సభలు విధిగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా ఉదయం 8 గంటలకు సభలు ప్రారంభం అయ్యేలా చూడాలని, షామియానాలు, తాగునీరు సదుపాయాలు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల వివరాలను గ్రామ, వార్డుల వారీగా సభలలో వెల్లడించాలని తెలిపారు.