News January 26, 2025

కామారెడ్డి: 615 ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించాం: కలెక్టర్

image

4 పథకాల ప్రారంభోత్సవంపై సీఎస్ శాంతి కుమారి కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ.. జిల్లాలో 535 గ్రామ, 80 వార్డు ప్రజాపాలన సభలు నిర్వహించినట్లు తెలిపారు. నాలుగు పథకాలకు సంబంధించి 1,03,938 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి లబ్ధిదారుల జాబితాలు సిద్ధం చేయడం జరిగిందని వివరించారు..

Similar News

News October 21, 2025

అనంతపురంలో ‘కె ర్యాంప్’ హీరో

image

‘కె ర్యాంప్’ సినిమా హీరో కిరణ్ అబ్బవరం సోమవారం రాత్రి అనంతపురంలో సందడి చేశారు. నగరంలోని గౌరీ థియేటర్లో ఆయన ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించారు. థియేటర్‌కు హీరో వచ్చాడన్న విషయం తెలుసుకుని అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు వేశారు. ఈ దీపావళికి సినిమా బ్లాక్ బస్టర్ అయిందని హీరో కిరణ్ అబ్బవరం తెలిపారు. శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

News October 21, 2025

నేడు అన్నమయ్యలో అమరవీరుల వారోత్సవాలు

image

పోలీస్ అమర వీరుల వారోత్సవాలను విజయవంతం చేయాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పిలుపు నిచ్చారు. ఈనెల 21 నుంచి 31 వరకు వారోత్సవాలను నిర్వహిస్తామన్నారు. ప్రజలు, విద్యార్థులు, ప్రజా సంఘాల భాగస్వామ్యంతో దేశ రక్షణ, ప్రజల భద్రతలో అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ.. జిల్లాలో ర్యాలీలు, వారోత్సవాలను నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.

News October 21, 2025

5,800 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

image

రైల్వేలో 5,800 నాన్ టెక్నికల్ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిగ్రీ అర్హతతో 18నుంచి 33ఏళ్లు గల అభ్యర్థులు నవంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. 3,050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్ పాసైన18 నుంచి 30 ఏళ్లు గల అభ్యర్థులు ఈనెల 28 నుంచి నవంబర్ 27వరకు దరఖాస్తు చేయవచ్చు. వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in/