News April 10, 2025

కామారెడ్డి: 76కు చేరుకున్న కల్తీ కల్లు బాధితులు

image

కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ బీర్కూర్ గాంధారి మండలాల్లో కల్తీ కల్లు బాధితుల సంఖ్య 76కు చేరుకుంది. బాన్సువాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని గత మూడు రోజులుగా 24 మందిని కామారెడ్డి నిజామాబాద్ జిల్లా ఆసుపత్రులకు రిఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు. బాన్సువాడ ఆసుపత్రికి బుధవారం ముగ్గురు బాధితులు రాగా, ఇద్దరిని డిశ్చార్జ్ చేశామని ఒకరు అడ్మిట్ అయ్యారని వైద్యులు తెలిపారు.

Similar News

News February 26, 2026

లిక్కర్ కేసు నిందితుడు ముప్పిడి అవినాశ్ రెడ్డికి రిమాండ్

image

AP: లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు ముప్పిడి అవినాశ్ రెడ్డికి ACB కోర్టు రేపటి దాకా రిమాండ్ విధించింది. గుంటూరు(D) జైలుకు అతడిని తరలించారు. A1 రాజ్ కసిరెడ్డితో కలిసి అవినాశ్ ₹కోట్ల లావాదేవీలు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ‘మద్యం సిండికేట్‌కు ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించారు. ముడుపులు చెల్లించే కొత్త బ్రాండ్లకు అనుకూలంగా ఆర్డర్ ఫర్ సప్లై కేటాయించారు’ అని అందులో వెల్లడించారు.

News February 26, 2026

పార్వతీపురం: ‘ఉగాది నాటికి 7,187 ఇళ్లు పూర్తి కావాలి’

image

జిల్లాలో గృహ నిర్మాణ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ డా.ఎన్ ప్రభాకర రెడ్డి సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్స్‌లో భాగంగా గృహ నిర్మాణ పురోగతిపై కీలక సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఉగాది పండగ నాటికి మొత్తం 7,187 ఇళ్లను పూర్తి చేయాలన్నారు.

News February 26, 2026

కన్నులపండువగా శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు

image

AP: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీసీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. తొలిరోజు స్వామి పుష్కరిణిలో తెప్పపై మూడు సార్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.