News February 3, 2025
కామారెడ్డి BJP జిల్లా అధ్యక్షుడిగా రాజు

కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నీలం రాజు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకుముందు జిల్లా అధ్యక్షురాలిగా అరుణాతార పనిచేశారు. ఆమె స్థానంలో రాజును నియమించారు .అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన బీజేపీకి ఎన్నో సేవలు అందించారు. ఆయన సేవలను పార్టీ అధిష్టానం గుర్తించింది.
Similar News
News January 22, 2026
VJA: రైల్వే జీఎంను కలిసిన ఎంపీ కేశినేని

కొండపల్లి-విజయవాడ రైల్వే ట్రాక్ వెంబడి నెలకొన్న మురుగు, వర్షపు నీటి సమస్యకు పరిష్కారం చూపాలని MP కేశినేని చిన్ని కోరారు. సికింద్రాబాద్లో దక్షిణ మధ్య రైల్వే GM సంజయ్ కుమార్ శ్రీవాత్సవను కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. క్రాస్ కల్వర్టులు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా ట్రాక్ భద్రతను కాపాడవచ్చని సూచించారు. ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు VJAలో ‘ఉపగ్రహ రైల్వే స్టేషన్’ ఏర్పాటు చేయాలన్నారు.
News January 22, 2026
60 రోజుల్లోపు చార్జ్ షీట్ దాఖలు చేయాలి: జిల్లా ఎస్పీ

కర్నూలు జిల్లాలో నేరాల నియంత్రణకు సాంకేతికతను సమర్థంగా వినియోగించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మహిళల భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ మద్యపానంపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేస్తూ, పోక్సో కేసుల్లో 60 రోజుల్లోపు చార్జ్ షీట్ దాఖలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
News January 22, 2026
కొత్త GHMC కమిషనర్ కార్యాలయాలు ఇక్కడే!

ఫిబ్రవరి 10 తర్వాత GHMC 3 కార్పొరేషన్లు (హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి)గా విడిపోనుంది. దీంతో కొత్త కార్పొరేషన్ల కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ కార్యాలయంలోనే హైదరాబాద్, తార్నాక పాత హెచ్ఎండీఏ కార్యాలయంలో మల్కాజిగిరి, మాదాపూర్లోని నేషనల్ అకాడమి ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) బిల్డింగ్లో సైబరాబాద్ కార్పొరేషన్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నట్లు తెలిసింది.


