News February 24, 2025

కామారెడ్డి: CM రేవంత్ రెడ్డిని సన్మానించిన డీసీసీ అధ్యక్షుడు

image

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార నిమిత్తం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నిజామాబాద్ పట్టణానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు పూలబొకేను ఇచ్చి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, జిల్లా నాయకులు ఉన్నారు.

Similar News

News November 24, 2025

MNCL: పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

image

2025- 26 సంవత్సరానికి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ (టీసీసీ) పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదలైంది. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ రూ.100, హయ్యర్‌ రూ.150, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ రూ.150, హయ్యర్ రూ.200 పరీక్ష ఫీజు చెల్లించాలని మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య తెలిపారు. అపరాధ రుసుం లేకుండా డిసెంబర్ 5 వరకు, అపరాధ రుసుం రూ.50తో 12వ తేదీ, రూ.75తో 19వ తేదీ వరకు ఫీజు చెల్లించాలని సూచించారు.

News November 24, 2025

నెల్లూరు విద్యార్థులకు ఎవరెస్ట్ ఎక్కే ఛాన్స్.!

image

జిల్లాలోని 52 మంది దివ్యాంగ విద్యార్థులకు అపురూప సాహస యాత్ర అవకాశం దక్కింది. సమగ్రశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘అడ్వెంచర్ స్పోర్ట్స్’కార్యక్రమానికి విద్యార్థులు ఎంపికయ్యారు. PMశ్రీ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపితే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రకు ఎంపికవుతారు. ముందుగా వారు జోనల్ స్థాయి, రాష్ట్రస్థాయికి ఎంపిక కావాలి. అందుకోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News November 24, 2025

శ్రీకాకుళం జిల్లాస్థాయి సంఘ సమావేశాల నిర్వహణ

image

శ్రీకాకుళం జిల్లా స్థాయి సంఘ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈఓ సత్యనారాయణ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రం నుంచి ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 29న ఈ సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. వివిధ స్థాయి సంఘాల ప్రతినిధులతో పాటు అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారన్నారు. సమావేశాలకు అధికారులు పూర్తిస్థాయి సమాచారంతో పాల్గొనాలని ఆదేశించారు.