News May 25, 2024
కామారెడ్డి DMHO సస్పెన్షన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_52024/1716641432461-normal-WIFI.webp)
కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న మహిళా వైద్యులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ సింగ్ సస్పెన్షన్కు గురయ్యారు. రాష్ట్ర ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ సస్పెన్షన్ ఉత్తర్వులను శనివారం జారీ చేశారు. ఆయనపై పోలీస్ స్టేషన్లో 7 కేసులు నమోదు కావడం, విచారణ నివేదిక ఆధారంగా ఆయనను సస్పెండ్ చేశారు.
Similar News
News February 12, 2025
NZB: సీఎం రూ.35 వేలు బాకీ: ఎమ్మెల్సీ కవిత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739363415879_50139228-normal-WIFI.webp)
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న హైదరాబాద్లో తలపెట్టనున్న మహిళా శంఖారావం సభ పోస్టర్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 14 నెలలు అయినా మహిళలకు ప్రతి నెల రూ.2500 ఇవ్వడం లేదని, రేవంత్ రెడ్డి మహిళలకు రూ.35 వేల చొప్పున బాకీ పడ్డారన్నారు. ప్రతీ మహిళా బ్యాంకు ఖాతాలో రూ.35వేలు జమ చేయాలన్నారు.
News February 12, 2025
NZB: మధ్యాహ్న భోజన నిర్వహణను గాలికొదిలేశారు: కవిత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739339154645_50139228-normal-WIFI.webp)
తమ అసమర్థతతో ఇప్పటికే గురుకులాల వ్యవస్థను భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణను గాలికొదిలేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం Xలో విమర్శించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు లేక భోజనం కోసం విద్యార్థులు ఎండలో కి.మీ. నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పాఠశాల ఆవరణలోనే భోజనం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
News February 12, 2025
NZB: ప్రయోగ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన DIEO
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739357285585_50486028-normal-WIFI.webp)
నిజామాబాద్లో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో రెండో దశ చివరి రోజు ప్రయోగ పరీక్షలు జరుగుతున్న పరీక్ష కేంద్రాలను బుధవారం DIEO రవికుమార్ తనిఖీ చేశారు. ప్రయోగ పరీక్షలు జరుగుతున్న పలు ప్రైవేటు కళాశాలలు, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలను ఆయన తనిఖీ చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో కెమెరాలు పని చేస్తున్న విషయాన్ని స్వయంగా DIEO పరిశీలించారు.