News April 1, 2025

కామారెడ్డి: WOW.. రాయిని చీల్చి.. వృక్షంగా ఎదిగి!

image

ప్రకృతి అంతులేని శక్తికి నిదర్శనంగా నిలిచే ఒక అద్భుతమైన దృశ్యం నిజాంసాగర్ శివార్లో కనిపించింది. నిశ్చలంగా కనిపించే ఒక పెద్ద బండరాయిని చీల్చుకుంటూ ఓ మొక్క మొలకెత్తి, నేడు ఎదిగి వృక్షంగా మారింది. ఏది ఏమైనప్పటికీ, ఈ రాయిని చీల్చుకుని ఎదిగిన వృక్షం మనందరికీ ఒక గొప్ప సందేశాన్నిస్తోంది. అడ్డంకులు ఎంత పెద్దగా ఉన్నా, పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చనే స్పూర్తినిస్తోంది.

Similar News

News November 19, 2025

మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు: నిర్మల్ కలెక్టర్

image

జిల్లాలో అర్హులైన మహిళలందరికీ ఇందిరా మహిళా శక్తి చీరలు అందిస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బుధవారం చీరల పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన వీసీలో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో మొత్తం 1,70,331 చీరలు పంపిణీ చేస్తామన్నారు. ఇందులో 1,14,681 చీరలు జిల్లాకు చేరుకున్నాయని, మిగతా 55,650 చీరలు త్వరలోనే వస్తాయని వెల్లడించారు.

News November 19, 2025

కగార్ ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలి: సీపీఐ

image

కగార్ ఆపరేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న మావోయిస్టుల ఎన్‌కౌంటర్లన్నింటిపైనా న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్తో కలిసి ఆయన ఈ మేరకు తెలిపారు.

News November 19, 2025

PM కిసాన్ 21వ విడత.. రూ.18 వేల కోట్లు జమ

image

దేశ వ్యాప్తంగా అన్నదాతలకు రబీ పెట్టుబడి సాయం కింద PM కిసాన్ 21వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన కార్యక్రమంలో.. దేశ వ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేలు చొప్పున రూ.18వేల కోట్లను ప్రధాని జమ చేశారు. ఇప్పటి వరకు PM కిసాన్ 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నిధులను అన్నదాతల అకౌంట్లలో కేంద్రం జమ చేసింది.