News July 28, 2024
కారంచేడు: గేదెను ఢీకొని ఉపాధ్యాయుడు మృతి

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన కారంచేడు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. తిమిడిదపాడు స్వర్ణ గ్రామాల మధ్యలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వంకాయలపాడు గ్రామానికి చెందిన ఈదర శ్రీనివాసరెడ్డి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా గేదె రోడ్డుపై అడ్డు రావడంతో ద్విచక్ర వాహనం బలంగా దూడను ఢీకొంది. ఈ ప్రమాదంలో గేదె, ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మృతి చెందారు.
Similar News
News December 15, 2025
అమర జీవికి సెల్యూట్ చేసిన ప్రకాశం SP.!

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరజీవి చిత్రపటానికి ఎస్పీ హర్షవర్ధన్ రాజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గౌరవ వందనంగా SP సెల్యూట్ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకోసం ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా అమరజీవి ఆమరణ నిరాహార దీక్షతో ఆత్మార్పణ చేసి అమరులయ్యారన్నారు.
News December 15, 2025
ఒంగోలు మేయర్ అంటే.. లెక్కలేదా: సుజాత

ఒంగోలు మేయర్ గంగాడ సుజాతకు కోపమొచ్చింది. నేడు మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఒంగోలులో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి మంత్రులు సైతం హాజరవుతున్నారు. విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన శిలాఫలకంపై మేయర్ సుజాత పేరు లేకపోవడం, అలాగే ఆహ్వాన పత్రికలో సైతం ఆమె పేరు లేకపోవడంతో మేయర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలు నచ్చజెప్పే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం.
News December 15, 2025
జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

డిసెంబర్ నెల 15వ తేదీన సోమవారం ఒంగోలు జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టర్ మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్జీదారులు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలపవచ్చని సూచించారు.


