News January 27, 2025

కారంపూడి: టెన్త్ విద్యార్థి ఆత్మహత్య

image

ఉరివేసుకొని విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కారంపూడి మండలంలోని లక్ష్మీపురంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గార్లపాటి అమర్ (16) కారంపూడిలోని ఓప్రైవేటు స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ వాసు ఘటనా ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 24, 2025

HYD: డిజిటల్ ప్రపంచంలో భద్రత తప్పనిసరి: సీపీ

image

హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలకు కీలక సూచన చేశారు. ‘డిజిటల్ ప్రపంచంలో భద్రత తప్పనిసరి. మీ డేటా, మీ జీవితానికి కీలకం. దాన్ని మీరే కాపాడుకోవాలి. డేటా చోరీ జరిగితే, ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1930కు కాల్ చేయండి. లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి’ అని Xలో ట్వీట్ చేశారు.

News November 24, 2025

వరంగల్: తపాలా శాఖ ఫిర్యాదుల స్వీకరణ

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజల నుంచి తపాలా శాఖకు సంబంధించి ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్లు హనుమకొండ పోస్టల్ సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. 52వ డాక్ అదాలత్ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు తమ ఫిర్యాదులను పోస్టల్ కవర్లో కె. శ్రీకాంత్, అసిస్టెంట్ డైరెక్టర్(స్టాఫ్ & విజిలెన్స్) పోస్టుమాస్టర్ జనరల్ హైదరాబాద్ రీజియన్ 500001కు డిసెంబర్ 1లోపు పంపించాలన్నారు.

News November 24, 2025

మధిర: లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు

image

లంచం తీసుకుంటూ మధిర అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (ALO) కె.చందర్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. చనిపోయిన భవన కార్మికుడి పేరిట వచ్చే రూ.1.30 లక్షల ఇన్సూరెన్స్ బిల్లు పాస్ చేయడానికి అధికారి చందర్, మృతుడి భార్యను రూ.15,000 లంచం డిమాండ్ చేశాడు. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో ఖమ్మం రోడ్డులో వల పన్ని, లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.