News January 27, 2025
కారంపూడి: టెన్త్ విద్యార్థి ఆత్మహత్య

ఉరివేసుకొని విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కారంపూడి మండలంలోని లక్ష్మీపురంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గార్లపాటి అమర్ (16) కారంపూడిలోని ఓప్రైవేటు స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ వాసు ఘటనా ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 30, 2025
చైనా అంతరిక్ష యాత్రకు పాక్ ఆస్ట్రోనాట్!

చైనా, పాకిస్థాన్ దోస్తీ కొత్త పుంతలు తొక్కుతోంది. తమ టియాంగోంగ్ స్పేస్ స్టేషన్కు చేపట్టే స్వల్పకాలిక అంతరిక్ష యాత్రలో పాకిస్థానీ ఆస్ట్రోనాట్కు అవకాశం కల్పిస్తామని చైనా ప్రకటించింది. ఎంపికైన పాక్ వ్యోమగామికి తమ ఆస్ట్రోనాట్లతో పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ట్రైనింగ్ ప్రోగ్రామ్, మిషన్ టైమ్లైన్ను ఖరారు చేసే పనిలో చైనా, పాక్ స్పేస్ ఏజెన్సీలు ఉన్నాయని అక్కడి మీడియా వెల్లడించింది.
News October 30, 2025
కోరుట్ల: వేధింపులు భరించలేక బాలిక బలవన్మరణం

కోరుట్ల మండలానికి చెందిన ఓ బాలిక (17) బుధవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అదే మండలానికి చెందిన నందీశ్వర్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించడంతో మనస్తాపం చెంది బాలిక ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై చిరంజీవి కేసు నమోదు చేశారు. నిందితుడు నందీశ్వర్ను పోలీసులు అరెస్టు చేసి, తదుపరి విచారణ నిమిత్తం రిమాండ్కు తరలించారు
News October 30, 2025
సిద్దిపేట: ‘మాత శిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి’

మాతా, శిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ధనరాజ్ అన్నారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆయా కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. 12 వారాలలోపు గర్భిణీలను తప్పనిసరిగా నమోదు చేయాలని, ప్రతి గర్భిణీపై కనీసం 4 సార్లు వైద్య విసిట్స్ నిర్వహించాలని సూచించారు. ప్రతి చెకప్లో HB లెవెల్స్, ఇతర పరీక్షలు చేయాలన్నారు.


