News November 10, 2024
కార్తీక పౌర్ణమి ప్రత్యేక బస్సులను వినియోగించుకోవాలి: మంత్రి పొన్నం

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పంచభూతాలలో ఒకటైన అరుణాచల పుణ్యక్షేత్రానికి తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నామన్నారు. కాణిపాకం గోల్డెన్ టెంపుల్ దర్శన సౌకర్యం ఉంటుందన్నారు.
Similar News
News December 20, 2025
KNR: ఎన్నికల విధులకు గైర్హాజరు.. 713 మందికి నోటీసులు

గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన 713 మంది ఉద్యోగులకు కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి అశ్విని తానాజీ వాకడే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మూడు విడతల్లో జరిగిన పోలింగ్కు పీఓ, ఏపీఓలుగా నియామకమైనా, ముందస్తు అనుమతి లేకుండా వీరు విధులకు రాలేదని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోకూడదో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
News December 20, 2025
KNR: ఓవర్సీస్ స్కాలర్ షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని మైనారీటీ విద్యార్థులు విదేశాల్లో విద్య నభ్యసించేందుకు 2025 ఓవర్సీస్ స్కాలర్ షిప్కు దరఖాస్తులు చేసుకోవాలని సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. పీజీ, పిహెచ్డి చేయుటకు జనవరి 19 లోగా వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, సంబంధిత ధ్రువీకరణ పత్రాలు ఫిబ్రవరి 20 వరకు కరీంనగర్ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు 87829 57085 నంబర్ సంప్రదించాలని కోరారు.
News December 20, 2025
విద్యార్థులందరికీ దంత పరీక్షలు: కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులెవరూ దంత సమస్యలతో బాధపడకూడదని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కరీంనగర్ ప్రధాన ఆస్పత్రిలో విద్యార్థుల చికిత్స తీరును ఆమె పరిశీలించారు. ఇప్పటివరకు 12 వేల మందికి పరీక్షలు నిర్వహించి, 1500 మంది బాధితులను గుర్తించినట్లు తెలిపారు. ఈనెల 23లోగా తొలి విడత పూర్తి చేసి, జనవరి 1 నుండి రెండో విడత శిబిరాలు ప్రారంభించాలని వైద్యులకు సూచించారు.


