News February 7, 2025
కార్పొరేట్ తరహాలో విద్య అందించాలి: పుట్టపర్తి ఎమ్మెల్యే

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పేద కుటుంబాలకు చెందిన వారని, వారికి కార్పొరేట్ తరహాలో నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
Similar News
News December 8, 2025
KMR: స్థానిక పోరులో కొత్త ట్రెండ్

కామారెడ్డి జిల్లాలో సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు వినూత్న వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు.. ఎన్నో ఏండ్లుగా తగాదాల కారణంగా దూరమైన ఓటర్ల వద్దకు నేరుగా వెళ్తున్నారు. పాత విభేదాలు, ఘర్షణలను పక్కన పెట్టి, ‘క్షమించండి’ అంటూ చేతులు జోడిస్తున్నారు. ఈ భావోద్వేగపూరిత ప్రచారం ఓటర్లపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి.
News December 8, 2025
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

సోమవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్తో పాటు మండల,డివిజన్ కేంద్రాలు,మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా,ఆన్లైన్లో meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చన్నారు. అర్జీ పరిష్కార స్థితి గురించి తెలుసుకోవడానికి వెబ్సైట్లోనూ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చున్నారు.
News December 8, 2025
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

సోమవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్తో పాటు మండల,డివిజన్ కేంద్రాలు,మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా,ఆన్లైన్లో meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చన్నారు. అర్జీ పరిష్కార స్థితి గురించి తెలుసుకోవడానికి వెబ్సైట్లోనూ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చున్నారు.


