News April 16, 2025

కార్పొరేట్ తరహా వైద్య సేవలు: MLA వీరేశం

image

పేదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నత ప్రమాణాలతో కూడిన మెరుగైన వైద్యం అందించడమే ప్రధాన ధ్యేయమని MLA వీరేశం అన్నారు. నకిరేకల్‌లో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆస్పత్రిని పనులను పరిశీలించారు. 95% నిర్మాణ పనులు పూర్తయ్యాయని, 5 ఆపరేషన్ థియేటర్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్పొరేట్ వైద్యం తరహాలో ఇక్కడ వైద్య సేవలు అందుబాటులోకి రాబోతున్నాయని, ఆసుపత్రిని సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామని వెల్లడించారు.

Similar News

News November 27, 2025

పాలకుర్తి: నువ్వా? నేనా? అన్నట్లుగా ఎన్నికలు!

image

పాలకుర్తి నియోజకవర్గంలో జరగబోయే స్థానిక ఎన్నికలు నువ్వా? నేనా? అన్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది. నియోజకవర్గంలో ఓడిపోయినప్పటికీ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిత్యం ప్రజల్లో ఉంటూ కార్యకర్తలను సమన్వయం చేస్తున్నారు. ఎమ్మెల్యే యశస్విని, అత్త ఝాన్సీ రెడ్డిలు సైతం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. ప్రజలతో మమేకమవుతున్నారు. ఎవ్వరు తగ్గేది లేదు అన్నట్టుగా ఉండటంతో నువ్వా? నేనా? అన్నట్టుగా ఉంది.

News November 27, 2025

ప్రపంచంలోనే తొలిసారి.. సింగిల్ డోస్ డెంగ్యూ వ్యాక్సిన్

image

అన్ని దేశాల్లో డెంగ్యూ కేసులు పెరిగి మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో బ్రెజిల్ సైంటిస్టులు అద్భుతం చేశారు. ప్రపంచంలోనే తొలిసారి సింగిల్ డోస్ డెంగ్యూ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. Butantan-DV అనే ఈ టీకాను 12-59 ఏళ్ల ప్రజలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రస్తుతం డెంగ్యూకు TAK-003 వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. WHO నిబంధనల ప్రకారం 3 నెలల వ్యవధిలో రెండుసార్లు వేసుకోవాలి.

News November 27, 2025

TTD మాజీ AVSO కుటుంబానికి స్నేహితుల అండ

image

ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన TTD మాజీ AVSO వై.సతీశ్ కుమార్ కుటుంబానికి ఆయన స్నేహితులు(2012 బ్యాచ్‌మేట్స్) అండగా నిలిచారు. ఈనెల 15న పరకామణి కేసు విచారణకు వెళ్తూ సతీష్ రైలు పట్టాలపై శవంగా కనిపించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన కర్మక్రియలకు హాజరైన AP, తెలంగాణలకు చెందిన బ్యాచ్‌మేట్స్ సతీష్ తల్లి పేరిట రూ.3 లక్షలు, పిల్లల పేరిట రూ.11 లక్షల ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు.