News December 21, 2024

కార్పొరేషన్‌గా మహబూబ్‌నగర్

image

మహబూబ్‌నగర్ పట్టణం ఇక అప్‌గ్రేడ్ కానుంది. పట్టణాన్ని మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ చేస్తన్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీలో ప్రకటించారు. ప్రస్తుతం పట్టణంలో 49 వార్డుల్లో 2.88 లక్షల జనాభా ఉంది. కొత్తగా కార్పొరేషన్ ఏర్పడేందుకు 3 లక్షల జనాభా అవసరం కానుండటంతో శివారులోని జైనల్లీపూర్, దివిటిపల్లి గ్రామాలు విలీనం కానున్నాయి. ఇదిలా ఉండగా మద్దూరు, దేవరకద్ర పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారనున్నాయి.

Similar News

News March 17, 2026

పాలమూరు: రంజాన్ వేళ ఘుమఘుమలు..!

image

పవిత్ర రంజాన్ నెల వచ్చిందంటే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో హలీమ్.. నోరూరించే చికెన్ హరీస్ దర్శనమిస్తాయి. ముస్లింలతో పాటు ఇతర వర్గాల వారు కూడా ఇష్టంగా కొనుక్కుని తింటారు. ప్రధాన రహదారుల్లో, పెద్ద హోటళ్ల ముందు నిర్వాహకులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. పలుచోట్ల సాయంత్రం వేళల్లో భోజన ప్రియులు క్యూలు కట్టి మరీ తింటున్నారు. మీరు తిన్నారా? కామెంట్ చేయండి?

News March 17, 2026

ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం పారదర్శకంగా సాగాలి: కలెక్టర్

image

మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ క్యాంపును కలెక్టర్ ఖుష్బూ గుప్తా
సోమవారం సందర్శించారు. సమాధాన పత్రాల మూల్యాంకనం జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. ప్రశ్నాపత్రాల
మూల్యాంకనం పారదర్శకంగా, సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

News March 16, 2026

పాలమూరు: SZ.. రేపు KHO-KHO ఎంపికలు

image

పాలమూరు యూనివర్సిటీలో సౌత్ జోన్ టోర్నీలో పాల్గొనేందుకు KHO-KHO ఎంపికలు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ పీడీ డాక్టర్ వై.శ్రీనివాసులు ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఈనెల 17న పురుషులకు ఖో-ఖో ఎంపికలు నిర్వహిస్తామని, ముఖ్య అతిథిగా వీసీ జిఎన్.శ్రీనివాస్ హాజరవుతారన్నారు. 17-25 ఏండ్ల లోపు ఉండాలని, క్రీడాకారులు బోనఫైడ్, ఆధార్ ప్రిన్సిపల్ సంతకంతో ఆ కళాశాల ఫిజికల్ డైరెక్టర్‌తో హాజరు కావాలన్నారు. SHARE IT