News January 27, 2025
కార్పొరేషన్గా మారిన మంచిర్యాల

మంచిర్యాల మున్సిపాలిటీ పాలకవర్గం పదవీ కాలం ఆదివారంతో ముగిసింది. జిల్లాలోనే పాత మున్సిపాలిటీగా ఉన్న మంచిర్యాలను కార్పొరేషన్గా మారుస్తూ ప్రభుత్వం ఇటీవల గెజిట్ విడుదల చేసింది. దీంతో నస్పూర్ మున్సిపాలిటీతో పాటు హాజీపూర్ మండలంలోని వేంపల్లి, కొత్తపల్లి, పోచంపాడ్, ముల్కల్ల, గుడిపేట, చందనాపూర్, నర్సింగాపూర్, నంనూర్ గ్రామాల విలీనంతో పాత కొత్త కలయికలతో మంచిర్యాల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.
Similar News
News December 3, 2025
సివిల్ కాంట్రాక్టర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం: ASF SP

ఆసిఫాబాద్ జిల్లాలో పోలీస్ శాఖ భరోసా సెంటర్ భవన నిర్మాణానికి సివిల్ కాంట్రాక్టర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు SP నితికా పంత్ తెలిపారు. డిసెంబర్ 4న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు AR పోలీస్ హెడ్ క్వార్టర్స్లో విల్లింగ్ కొటేషన్స్ స్వీకరిస్తామన్నారు. రూ.కోటిపైగా వ్యయంతో నిర్మాణ అనుభవం, 10 ఏళ్ల సేవ, 4 నెలల్లో పని పూర్తి చేసే సామర్థ్యం అర్హతలుగా పేర్కొన్నారు.
News December 3, 2025
కోనసీమ జిల్లా వాసులకు GOOD NEWS

అమలాపురంలోని ఉపాధి కార్యాలయంలో ఈనెల 6న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి వసంతి లక్ష్మి తెలిపారు. ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా డిగ్రీ అర్హత గల అభ్యర్థులు తమ ధ్రువపత్రాలు, బయోడేటాతో హాజరుకావాలని ఆమె సూచించారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News December 3, 2025
రూ.3.30 నుంచి రూ.90 వరకు.. రూపాయి పతనం ఇలా!

స్వాతంత్య్రం(1947) వచ్చేనాటికి డాలరుతో రూపాయి మారకం విలువ రూ.3.30 ఉండేది. 30 సంవత్సరాల తర్వాత..
☛ 1977లో అది రూ.8.434కు చేరింది
☛ తరువాతి 30 ఏళ్ల(2007)కు 43.595గా ఉంది
☛ 2020లో రూ.73.23, 2021లో రూ.74.56, 2022లో రూ.82.76, 2023లో 83.4
☛ 2024లో 83.28కు బలహీనపడింది
☛ తాజాగా 2025 డిసెంబర్ నాటికి 90 రూపాయలకు పతనమైంది.


