News January 27, 2025

కార్పొరేషన్‌గా మారిన మంచిర్యాల

image

మంచిర్యాల మున్సిపాలిటీ పాలకవర్గం పదవీ కాలం ఆదివారంతో ముగిసింది. జిల్లాలోనే పాత మున్సిపాలిటీగా ఉన్న మంచిర్యాలను కార్పొరేషన్‌గా మారుస్తూ ప్రభుత్వం ఇటీవల గెజిట్ విడుదల చేసింది. దీంతో నస్పూర్ మున్సిపాలిటీతో పాటు హాజీపూర్ మండలంలోని వేంపల్లి, కొత్తపల్లి, పోచంపాడ్‌, ముల్కల్ల, గుడిపేట, చందనాపూర్‌, నర్సింగాపూర్‌, నంనూర్‌ గ్రామాల విలీనంతో పాత కొత్త కలయికలతో మంచిర్యాల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.

Similar News

News February 10, 2025

ప్రముఖ నటుడు కన్నుమూత

image

మలయాళ నటుడు అజిత్ విజయన్(57) కన్నుమూశారు. తన నివాసంలో మరణించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఒరు ఇండియన్ ప్రణయకథ, బెంగళూరు డేస్, అమర్ అక్బర్ అంథోని, అంజు సుందరికల్ తదితర సినిమాల్లో ఆయన నటించారు. ఆయన మృతిపై మలయాళ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

News February 10, 2025

ఇండియా కూటమిలో ఉండాలా వద్దా: ఆప్‌ సందిగ్ధం

image

ఢిల్లీ ఓటమితో ఆమ్‌ఆద్మీ పార్టీలో నిస్తేజం నెలకొంది. ఒకవైపు పంజాబ్‌లో పార్టీ చీలిపోతుందేమోనని భయం. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, అవధ్ ఓజా, సత్యేందర్ జైన్ అడుగుపెట్టలేని పరిస్థితి. పార్టీని ఆతిశీ టేకోవర్ చేస్తారేమోనన్న ఆందోళన. వీటన్నిటి నడుమ ఇండియా కూటమిలో కొనసాగాలో లేదో తేల్చుకోలేని పరిస్థితిలో ఆప్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ ఉన్న కూటమిని వీడొచ్చని వారి అంచనా.

News February 10, 2025

YCPలోకి నగరి MLA సోదరుడు..?

image

నగరి MLA గాలి భానుప్రకాశ్ సోదరుడు జగదీశ్ YCPలో చేరుతారని సమాచారం. ఆయన తండ్రి ముద్దుకృష్ణమ నాయుడు 2019లో మృతిచెందారు. రాజకీయ వారసుడి విషయంలో అప్పట్లో సందిగ్ధం నెలకొంది. దీంతో చంద్రబాబు ముద్దుకృష్ణమ సతీమణి సరస్వతికి MLC ఇచ్చారు. 2019, 24లో భాను ప్రకాశ్‌కు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. అప్పటి నుంచి జగదీశ్ తటస్థంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఈనెల 12న ఫ్యాన్ గూటికి చేరుతారని సమాచారం.

error: Content is protected !!