News December 12, 2024
కార్పొరేషన్ విధులు పకడ్బందీగా నిర్వహించాలి: తుమ్మల
ఖమ్మం నగర పరిధిలో కార్పొరేషన్ విధులను పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం కార్పొరేషన్ కార్యకలాపాలపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కార్పొరేషన్లో విలీనమైన పంచాయతీల్లో కార్మికుల కొరత, తాగు నీటి సమస్యలు, ఫాగింగ్ యంత్రాలు, పనిముట్లు లేవని క్షేత్ర స్థాయి నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. ఈ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News January 24, 2025
అద్దె ఇంట్లో ఉన్నవారు అనర్హులని అనడం దారుణం: బీజేపీ
జూలూరుపాడు: అద్దె ఇంట్లో ఉన్న వారిని ప్రభుత్వం అనర్హులని తేల్చడం దారుణమని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ అన్నారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిజమైన అర్హులకు ప్రభుత్వ పథకాలు ఇచ్చేవరకు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
News January 24, 2025
ఖమ్మం: గ్రామసభల ఆప్డేట్
ఖమ్మం జిల్లాలోని 589 గ్రామపంచాయతీలలో మూడు రోజులపాటు గ్రామసభలు నిర్వహించారు. గురువారం వరకు జిల్లా వ్యాప్తంగా నాలుగు పథకాలకు 1,42,682 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. లబ్ధిదారుల లిస్ట్లో అర్హుల పేర్లు లేకపోతే మరోమారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దీంతో దరఖాస్తులు సమర్పించేందుకు గ్రామసభల వద్ద జనం బారులు తీరారు. సభలు నేడు చివరి రోజు కావడంతో దరఖాస్తులపై మరింత స్పష్టత రానుంది.
News January 24, 2025
వేసవిలో నిరంతర విద్యుత్కు చర్యలు: Dy.CM భట్టి
రానున్న వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. HYDలోని ప్రజాభవన్లో విద్యుత్ అధికారులతో నిర్వహించిన 2025 యాక్షన్ ప్లాన్లో Dy.CM మాట్లాడారు. జిల్లా, మండల విద్యుత్ అధికారులు ఇప్పటి నుంచే ఆ విధంగా సన్నద్ధం అవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.