News March 31, 2025
కార్యకర్తలే టీడీపీకి అధినేతలు: లోకేశ్

టీడీపీకి కార్యకర్తలే అధినేతలని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అచ్యుతాపురంలో సోమవారం పార్టీ కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి చరిత్రను తిరిగి రాశారని తెలిపారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పార్టీ ఇన్ఛార్జ్లు వారానికి ఒకరోజు పార్టీ కార్యకర్తలను కలిసి సమస్యలను పరిష్కరించాలన్నారు.
Similar News
News October 15, 2025
సికింద్రాబాద్: సంతోషం.. ఇప్పటికైనా మేల్కొన్నారు!

రైళ్లల్లో రోజూ వేల మంది టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. ఇది రైల్వే అధికారులకూ తెలుసు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక వ్యవస్థా ఉంది. అయితే ఎందుకో రైల్వే అధికారులు అసలు టికెట్ చెకింగ్ అనేదే చేయడం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా మేల్కొన్న అధికారులు తనిఖీలు చేయాలని నిర్ణయించి ఒక్కరోజు (మంగళవారం)లోనే రూ.కోటి పాయలు వసూలు చేశారు. ముందు నుంచే ఈ పని చేసి ఉంటే బాగుండేదని పలువురు పేర్కొంటున్నారు.
News October 15, 2025
ఆ నాలుగు మండలాల్లోనే వర్షపాతం నమోదు.!

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం 8:30 వరకు గడిచిన 24 గంటల్లో 9.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. కూసుమంచి మండలంలో 4.8, తల్లాడ మండలంలో 2.4, రఘునాథపాలెం మండలంలో 1.4, ఖమ్మం రూరల్ మండలంలో 1.0 మిల్లీమీటర్లు నమోదైనట్లు చెప్పారు. కాగా ఇతర మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదని పేర్కొన్నారు.
News October 15, 2025
దారులు వేరైనప్పుడు KCR ఫొటో పెట్టుకోవడం కరెక్ట్ కాదు: కవిత

TG: కేసీఆర్ ఫొటో లేకుండానే ‘జాగృతి జనం బాట’ చేపట్టనున్నట్లు కవిత ప్రకటించారు. ‘ఆయన కడుపున పుట్టడం జన్మజన్మల అదృష్టం. కానీ దారులు వేరవుతున్నప్పుడు ఇంకా KCR పేరు చెప్పుకోవడం నైతికంగా కరెక్ట్ కాదు. చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు. నేను వేరే తొవ్వ వెతుక్కుంటున్నా. గతంలో జాగృతి పెట్టినప్పుడు కూడా కేసీఆర్ ఫొటో పెట్టకుండా జయశంకర్ ఫొటోనే పెట్టాం’ అని చెప్పారు.