News March 31, 2025
కార్యకర్తలే టీడీపీకి అధినేతలు: లోకేశ్

టీడీపీకి కార్యకర్తలే అధినేతలని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అచ్యుతాపురంలో సోమవారం పార్టీ కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి చరిత్రను తిరిగి రాశారని తెలిపారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పార్టీ ఇన్ఛార్జ్లు వారానికి ఒకరోజు పార్టీ కార్యకర్తలను కలిసి సమస్యలను పరిష్కరించాలన్నారు.
Similar News
News November 20, 2025
మచిలీపట్నంలో సాగర్ కవాచ్ మాక్ డ్రిల్

మచిలీపట్నంలో సాగర్ కవాచ్ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘సాగర్ కవచ్’ అనేది భారతీయ తీర రక్షక దళం, ఇతర భద్రతా సంస్థలు నిర్వహించే ఒక వార్షిక సముద్ర భద్రతా విన్యాసం. సముద్ర ముప్పులను ఎదుర్కోవడానికి తీర ప్రాంత భద్రతా సంసిద్ధతగా ఈ డ్రిల్ నిర్వహించారు. తీర ప్రాంతంలో తీవ్రవాదులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతి సంవత్సరం ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తారు.
News November 20, 2025
భద్రాచలం: నెల రోజుల్లో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో డిసెంబరు 20 నుంచి జనవరి 9 వరకు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ వర్గాలు తగు ఏర్పాట్లు చేస్తున్నాయి. డిసెంబరు 29న స్వామివారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. అత్యంత ప్రసిద్ధి గాంచిన ఈ వేడుకల్లో భాగంగా డిసెంబరు 30న ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు, ఉత్తర ద్వార దర్శనం పూజలు జరగనున్నాయి.
News November 20, 2025
హిందీ Vs మరాఠీ వివాదం.. యువకుడు ఆత్మహత్య

హిందీ-మరాఠీ <<15354535>>వివాదం<<>> ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. MHలోని థానేకు చెందిన అర్ణవ్ ములంద్లోని కాలేజీకి వెళ్లేందుకు లోకల్ ట్రైన్ ఎక్కాడు. ఈక్రమంలోనే రైలులో హిందీ-మరాఠీపై చర్చ జరిగింది. ఇది కాస్తా గొడవకు దారి తీయడంతో ఐదుగురు యువకుల గ్యాంగ్ అర్ణవ్పై దాడి చేసింది. దీంతో అతడు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని అర్ణవ్ తండ్రి జితేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.


