News March 31, 2025
కార్యకర్తలే టీడీపీకి అధినేతలు: లోకేశ్

టీడీపీకి కార్యకర్తలే అధినేతలని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అచ్యుతాపురంలో సోమవారం పార్టీ కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి చరిత్రను తిరిగి రాశారని తెలిపారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పార్టీ ఇన్ఛార్జ్లు వారానికి ఒకరోజు పార్టీ కార్యకర్తలను కలిసి సమస్యలను పరిష్కరించాలన్నారు.
Similar News
News November 18, 2025
కడియం శ్రీహరిపై అనర్హత వేటు? రాజకీయాల్లో వేడి!

BRS నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన పది మంది MLAలపై ఫిరాయింపు ఫిర్యాదును స్పీకర్ త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందులో స్టేషన్ఘన్పూర్ MLA కడియం శ్రీహరి కూడా ఉన్నారు. ఇప్పటికే పలువురిని పరిశీలించినప్పటికీ కడియం శ్రీహరి, దానం నాగేందర్ స్పీకర్ నోటీసులకు స్పందించలేదు. రోజువారీ విచారణ జరిపి నాలుగు వారాల్లో నిర్ణయం ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులతో ఉప ఎన్నికతో సంభావ్యత పెరిగింది.
News November 18, 2025
కడియం శ్రీహరిపై అనర్హత వేటు? రాజకీయాల్లో వేడి!

BRS నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన పది మంది MLAలపై ఫిరాయింపు ఫిర్యాదును స్పీకర్ త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందులో స్టేషన్ఘన్పూర్ MLA కడియం శ్రీహరి కూడా ఉన్నారు. ఇప్పటికే పలువురిని పరిశీలించినప్పటికీ కడియం శ్రీహరి, దానం నాగేందర్ స్పీకర్ నోటీసులకు స్పందించలేదు. రోజువారీ విచారణ జరిపి నాలుగు వారాల్లో నిర్ణయం ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులతో ఉప ఎన్నికతో సంభావ్యత పెరిగింది.
News November 18, 2025
ఆయన ఆవిష్కరణలే ఆధునిక ఫోటోగ్రఫీకి బాట

ఫోటోగ్రఫీ పితామహుడిగా పేరుపొందిన లూయిస్ జాకస్ మండే డాగురే జన్మదినం నవంబర్ 18, 1787ను స్మరించుకుంటూ ప్రపంచం ఆయనను గుర్తుచేసుకుంది. డాగురే ఆవిష్కరించిన డాగురోటైప్ పద్ధతి ఆధునిక ఫోటోగ్రఫీకి బాట వేసింది. ఒకప్పుడు ఫోటోగ్రాఫర్ కి మాత్రమే పరిమితమైన కెమెరా, సాంకేతికత పెరిగి నేడు సామాన్యులు కూడా మొబైల్లు, కెమెరాలు వాడుతూ జ్ఞాపకాలను బంధించే ఈ ప్రపంచం ఆయన ప్రయోగాలపైనే నిలబడి ఉంది.


