News August 7, 2024

కార్వేటినగరం: డీఎల్ఈడీ ఫెయిల్ వారికి గమనిక

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రైవేటు డీఎల్ఈడీ కాలేజీల్లో 2018-20 రెగ్యులర్, స్పాట్ అడ్మిషన్లో ఫెయిల్ అయిన విద్యార్థులు, ఆ కళాశాల మూతపడినట్లయితే కార్వేటినగరం ప్రభుత్వ డైట్ కళాశాలను సంప్రదించాలని ప్రిన్సిపల్ శేఖర్ సూచించారు. ప్రభుత్వ డైట్ కళాశాలలో సంప్రదించి పరీక్ష ఫీజు కట్టి రాయవచ్చన్నారు. మరిన్ని వివరాలకు కార్వేటినగరం డైట్ కాలేజీని సంప్రదించాలని సూచించారు.

Similar News

News November 20, 2025

చిత్తూరు: విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.1.66 కోట్లు మంజూరైంది. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీల కింద ఈ నగదు చెల్లిస్తామని జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ తెలిపారు. ఏడాదికి రూ.6వేలు చొప్పున మొదటి విడతగా జిల్లాలో 5,553 మందికి 5నెలలకు రూ.1.66 కోట్లు జమ చేశామన్నారు.

News November 19, 2025

బెంగళూరు చేరుకున్న నారా భువనేశ్వరి

image

నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం నారా భువనేశ్వరి బెంగళూరు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతో పాటు నేతలు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన నారా భువనేశ్వరి ద్రవిడ విశ్వవిద్యాలయానికి మధ్యాహ్నం 2గంటలకు చేరుకోనున్నారు. వర్సిటీలో విద్యార్థులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.

News November 19, 2025

బెంగళూరు చేరుకున్న నారా భువనేశ్వరి

image

నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం నారా భువనేశ్వరి బెంగళూరు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతో పాటు నేతలు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన నారా భువనేశ్వరి ద్రవిడ విశ్వవిద్యాలయానికి మధ్యాహ్నం 2గంటలకు చేరుకోనున్నారు. వర్సిటీలో విద్యార్థులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.