News January 29, 2025
కాల్వ శ్రీరాంపూర్: కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదని తండ్రి ఆత్మహత్య

కాల్వ శ్రీరాంపూర్(M)లో ఓ వ్యక్తి మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలీలా.. మండలంలోని పెగడపల్లి గ్రామానికి చెందిన అడ్డగుంట సారంగం (55) అనే వ్యక్తి తన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదనే మనస్తాపంతో నిన్న సాయంత్రం పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం మరణించినట్లు కొడుకు శ్రీధర్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు.
Similar News
News October 21, 2025
వరంగల్ నిట్లో ప్రారంభమైన వెల్నెస్ సెంటర్

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ నిట్లో వెల్నెస్ సెంటర్ ప్రారంభమైంది. మంగళవారం నిట్ డైరెక్ట ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి వెల్నెస్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధ్యానం, యోగాభ్యాసం, మానసిక ఒత్తిడి నియంత్రణ వంటి పద్ధతులను విద్యార్థులు, అధ్యాపకుల దైనందిన జీవితంలోకి తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశం అన్నారు.
News October 21, 2025
మంథని: ఈనెల 24న రాజకీయ శిక్షణా శిబిరం

ఈనెల 24న కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఖాదర్ గూడెంలో నిర్వహించే రాజకీయ శిక్షణ శిబిరాన్ని యాదవ సోదరులు వినియోగించుకోవాలని అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేషం యాదవ్ కోరారు. మంథనిలో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవుల పాత్ర ఉండాలని అఖిల భారత మహాసభ నిర్ణయించిందన్నారు. దీనిలో భాగంగానే 24న పార్టీలకతీతంగా యాదవ సోదరులకు రాజకీయ శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.
News October 21, 2025
మురిపించని ‘మూరత్’.. ఫ్లాట్గా ముగిసిన మార్కెట్లు!

దీపావళి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ‘మూరత్ ట్రేడింగ్’ సెషన్ పెద్దగా మురిపించలేదు. మొదట లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్లు చివరికి ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 63 పాయింట్ల స్వల్ప లాభంతో 84,426 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 25,868 వద్ద ముగిశాయి. నిఫ్టీలో సిప్లా, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిక్ బ్యాంక్, ఇన్ఫోసిస్ పాజిటివ్గా ట్రేడ్ అవగా, కొటక్ మహీంద్రా, ICICI బ్యాంకులు, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి.