News January 31, 2025
కాళేశ్వరంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలోని మంగళికుంట చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి కాళేశ్వరం ఎస్సై తమాషా రెడ్డి చేరుకొని మృతి దేహాన్ని పరిశీలించారు. కాళేశ్వరానికి చెందిన వ్యక్తినా? లేక వేరే వ్యక్తినా? అని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 3, 2025
స్క్రబ్ టైఫస్.. జాగ్రత్తలపై అధికారుల సూచనలు

AP: ‘ఓరియంటియా సుత్సుగముషి’ బాక్టీరియాతో <<18446507>>స్క్రబ్ టైఫస్<<>> సంక్రమిస్తుందని అధికారులు వెల్లడించారు. కీటకం కుట్టిన చోట నల్లటి మచ్చతో పాటు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు ఉంటే స్క్రబ్ టైఫస్గా అనుమానించాలని చెప్పారు. ఎలుకలు సంచరించే ప్రదేశాల్లోని కీటకాలు కుడితే ఈ వ్యాధి వస్తుందన్నారు. పొలం పనులకు వెళ్లేవారు షూలు ధరించాలని, మంచాలు, పరుపులు, దిండ్లు వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలని సూచించారు.
Share it
News December 3, 2025
ఖమ్మం: తొలి రెండు రోజులు మద్యం కిక్కు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మద్యం విక్రయాల కిక్కు అదిరింది.. 2025-27 ఎక్సైజ్ సంవత్సరానికి కేటాయించిన మద్యం దుకాణాల్లో సోమవారం నుంచి మద్యం విక్రయాలు మొదలయ్యాయి. తొలి రెండు రోజులు ఉమ్మడి జిల్లాలోని 204 వైన్ షాపులకు వైరాలోని ఐఎంఎల్ డిపో నుంచి సుమారు రూ.40 కోట్ల మద్యం సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. గత ఎక్సైజ్ సంవత్సరం ముగింపు చివరి నెల రోజులు వైన్ షాపుల్లో ఆశించిన మేర మద్యం విక్రయాలు జరగలేదు.
News December 3, 2025
ఖమ్మం: అర్ధరాత్రి పొద్దుపోయేంతవరకు నామినేషన్లు

ఖమ్మం జిల్లాలో రెండో విడత నామినేషన్ల దాఖలు పూర్తయ్యాయి. అర్ధరాత్రి పొద్దుపోయేంతవరకు నామినేషన్లు దాఖలు చేశారు. 6 మండలాల్లో మొత్తం 183 గ్రామపంచాయతీలకు గాను 1055 నామినేషన్లు దాఖలయ్యాయి. అదే విధంగా 1686 వార్డులకు గాను 4160 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కూసుమంచి మండలంలో అత్యధికంగా సర్పంచ్ పదవికి 250 మంది నామినేషన్లు దాఖలు చేయడం విశేషం.


