News January 31, 2025

కాళేశ్వరంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలోని మంగళికుంట చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి కాళేశ్వరం ఎస్సై తమాషా రెడ్డి చేరుకొని మృతి దేహాన్ని పరిశీలించారు. కాళేశ్వరానికి చెందిన వ్యక్తినా? లేక వేరే వ్యక్తినా? అని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News February 24, 2026

రైల్ పార్సిల్ యాప్‌‌తో హోమ్ డెలివరీ.. దేశంలోనే తొలిసారి

image

డోర్ టు డోర్ పార్సిల్ బుకింగ్, డెలివరీ సేవలను అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే(SCR) దేశంలోనే తొలి ‘రైల్ పార్సిల్ యాప్‌’ను తీసుకొస్తోంది. రేపు HYD డివిజన్‌లో పైలట్ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించనుంది. రైల్వే సిబ్బంది వినియోగదారుల ఇళ్లకు వెళ్లి పార్సిళ్లను తీసుకొని డెలివరీ చేస్తారు. సేవల నిర్వహణ, లాజిస్టిక్స్ మార్కెట్‌పై స్టడీ చేసేందుకు IIM బెంగళూరుతో రైల్వే శాఖ ఒప్పందం చేసుకోనుంది.

News February 24, 2026

‘వాల్తేరు రైల్వేకు అదనపు ఆదాయం’

image

వాల్తేరు డివిజన్ తన టిక్కెట్టేతర ఆదాయాన్ని పెంచేందుకు 10 WAP-7 ఎలక్ట్రిక్ రైలు ఇంజిన్లపై ప్రకటనల కోసం ఢిల్లీ సంస్థతో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా ఏడాదికి రూ.7 లక్షలకు పైగా, మొత్తం మీద రూ. 26 లక్షల ఆదాయం లభిస్తుందని డీఆర్ఎం పవన్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఇంజిన్లపై జొమాటో వంటి ఆకర్షణీయమైన ప్రకటనలు కనిపిస్తున్నాయి.

News February 24, 2026

హనుమకొండ: రోడ్డు ప్రమాదాలపై అవేర్నెస్ పెంచండి: CP

image

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘అరైవ్- అలైవ్’ కార్యక్రమం ద్వారా పోలీస్ అధికారులు వారివారి స్టేషన్ల పరిధిలో రోడ్డు ప్రమాదాలపై ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే జరిగే నష్టాలపై ప్రజలకు అవెర్నెస్ కల్పించాలని వరంగల్ CP అధికారులను అదేశించారు. అలాగే కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల గురించి వివరించాలన్నారు.