News February 7, 2025

కాళేశ్వరంలో నేటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు

image

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను అర్చకులు చేపట్టనున్నారు. శుక్రవారం ఉదయం మేళతాళాలు, వేద మంత్రాలతో వేద పండితులతో కలిసి త్రివేణి సంగమం వద్దకు వెళ్లి ఐదు కలశాలతో పవిత్ర గోదావరి జలాలను ఆలయానికి తీసుకువస్తారు. అనంతరం మంగళవాయిద్యాలతో వేద స్వస్తివాచకములు, గణపతి పూజ, గోపూజ ప్రారంభమవుతాయి. తదుపరి ఉచిత పులిహోర ప్రసాదం, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు.

Similar News

News September 13, 2025

పార్వతీపురం: గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తాం

image

గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించడానికి కృషి చేస్తామని జిల్లా ప్రజా రవాణాధికారి పి.వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ప్రజా రవాణాధికారి కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ ప్రజా రవాణాధికారి కార్యక్రమానికి 26 వినతులు వచ్చాయి. ఉన్నతాధికారులను సంప్రదించి సాధ్యమైనంత వరకూ పల్లెలకు, చివరి గ్రామాలకు బస్సు సౌకర్యం, స్టాపుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News September 13, 2025

భారత్‌‌పై సుంకాలు విధించాలని G7, EUకి US రిక్వెస్ట్!

image

రష్యా నుంచి ఆయిల్ కొంటున్న భారత్‌, చైనాపై సుంకాలు విధించాలని G7 దేశాలు, EUను US కోరినట్లు రాయిటర్స్ తెలిపింది. G7 ఫైనాన్స్ మినిస్టర్ల మధ్య జరిగిన ఫోన్ కాల్‌లో దీనిపై చర్చ జరిగినట్లు పేర్కొంది. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి తేవాలని వారు చర్చించినట్లు తెలిపింది. ఫ్రీజ్ చేసిన రష్యా అసెట్స్‌ను వినియోగించుకుని, ఉక్రెయిన్ రక్షణకు నిధులు సమకూర్చేందుకూ అంగీకరించారని వెల్లడించింది.

News September 13, 2025

రూ. 2,000 కోట్లతో నౌకాదళ ఆయుధగారం ప్రాజెక్టు: MP పుట్టా

image

జీలుగుమిల్లిలో రూ.2,000 కోట్ల నౌకాదళ ఆయుధగారం ప్రాజెక్టు వస్తోందని ఏలూరు MP పుట్టా మహేశ్ కుమార్ అన్నారు. నేవీ అధికారులతో ఏలూరు కలెక్టరేట్లో శుక్రవారం ఎంపీ సమావేశమయ్యారు. ప్రాజెక్టు కోసం 1,116 ఎకరాల భూమి గుర్తించారన్నారు. భూసేకరణ పూర్తయితే పనులు మొదలవుతాయన్నారు. వచ్చే 10 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందని, దీనివల్ల అనేక మందికి ఉపాధి లభిస్తుందని ఎంపీ తెలిపారు.