News February 7, 2025
కాళేశ్వరంలో నేటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను అర్చకులు చేపట్టనున్నారు. శుక్రవారం ఉదయం మేళతాళాలు, వేద మంత్రాలతో వేద పండితులతో కలిసి త్రివేణి సంగమం వద్దకు వెళ్లి ఐదు కలశాలతో పవిత్ర గోదావరి జలాలను ఆలయానికి తీసుకువస్తారు. అనంతరం మంగళవాయిద్యాలతో వేద స్వస్తివాచకములు, గణపతి పూజ, గోపూజ ప్రారంభమవుతాయి. తదుపరి ఉచిత పులిహోర ప్రసాదం, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు.
Similar News
News April 18, 2026
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వైద్యారోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆస్పత్రుల్లో రోజువారీ నమోదవుతున్న ఓపీ వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్.. రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News April 18, 2026
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వైద్యారోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆస్పత్రుల్లో రోజువారీ నమోదవుతున్న ఓపీ వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్.. రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News April 18, 2026
మహిళా పోలీసుల సాధికారతే లక్ష్యం: డీజీపీ శివధర్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లో నిర్వహించిన ‘షీ లీడ్స్’ సదస్సులో డీజీపీ శివధర్ రెడ్డి పాల్గొన్నారు. మహిళా పోలీసులు వృత్తిపరంగా, సామాజికంగా రాణించాలని ఆయన ఆకాంక్షించారు. పోలీసు శాఖలో మహిళలకు కల్పించిన రిజర్వేషన్లు, భరోసా కేంద్రాల పనితీరును కొనియాడారు. అనంతరం మహిళా సిబ్బందికి స్కూటీలు, రక్షణ సామగ్రిని పంపిణీ చేశారు.


