News February 26, 2025
కాళేశ్వరంలో పూజలు చేసిన మాజీ మంత్రి

శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. వీరు ఆలయం వద్దకు రాగా ఆలయ అర్చకులు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. ఆలయంలోకి వెళ్లి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆలయంలో దర్శించుకున్నాక ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేశారు. మీరు వెంట మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, నాయకులు రాకేశ్ తదితరులు ఉన్నారు.
Similar News
News October 24, 2025
కేయూ పరిశోధకురాలు చైతన్య కుమారికి డాక్టరేట్

కాకతీయ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగ పరిశోధకురాలు కె.చైతన్య కుమారి డాక్టరేట్ పొందారు. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి కట్ల రాజేందర్ ప్రకటించారు. ఆచార్య వల్లూరి రామచంద్రం మార్గదర్శకత్వంలో ఆమె “Public Policy and Tribal Welfare: A Study of ITDA Programs in Kumram Bheem Asifabad District” అంశంపై పరిశోధన పూర్తి చేశారు. మంచిర్యాల్ జిల్లాకు చెందిన ఆమెను అధ్యాపకులు అభినందించారు.
News October 24, 2025
భామిని: ‘వార్డెన్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం’

భామిని మండలంలోని ఏకలవ్య ఆదర్శ ఆవాస పాఠశాలలో అతిధి హస్టల్ వార్డెన్(పురుషుడు)పోస్టుకు దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రిన్సిపాల్ గంగాదేవి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేసిన అనుభవం, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డీగ్రీ ఉండాలన్నారు. ముఖాముఖి కోసం ఈనెల 28న ఉదయం 9 గంటలకు పాఠశాలకు రావాలని కోరారు. మరిన్ని వివరాలకు94909 24540 నంబర్ను సంప్రదించాలని సూచించారు.
News October 24, 2025
రౌడీ షీటర్లకు ఎస్పీ కౌన్సెలింగ్

ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లాలోని రౌడీ షీటర్స్కు కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్తో సహా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సత్ప్రవర్తనతో మెలగేవారికి పోలీసుల సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.


