News February 6, 2025

కాళేశ్వరంలో మూడు రోజులు ఆర్జిత సేవలు బంద్

image

ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 7, 8, 9వ తేదీలలో మహా కుంభాభిషేక మహోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో మూడు రోజుల ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు ఈఓ మహేశ్ ప్రకటనలో పేర్కొన్నారు. మహాకుంభాభిషేక ఉత్సవాలకు వచ్చే భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకొని, అన్నప్రసాదం తీసుకోవాలని తెలిపారు. అలాగే మండలం మీదుగా నడిచే ఇసుక లారీలను 3 రోజులు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News March 22, 2025

రాజమండ్రి: వివాహం కావడం లేదని ఆత్మహత్య

image

వివాహం కావడం లేదని మనస్తాపం చెంది హుకుంపేట D-బ్లాక్‌కు చెందిన ఉరిటి రామ సుబ్రహ్మణ్యం (45) ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన తల్లి వెంకటలక్ష్మి శుక్రవారం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బొమ్మూరు పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై రమేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం రాజమండ్రిలోని ఒక ప్రైవేటు కంపెనీలో గుమస్తాగా పనిచేస్తున్నాడు.

News March 22, 2025

IPL: ఆ రికార్డు బ్రేక్ చేసేదెవరో?

image

నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో కొన్ని రికార్డులు ఇంకా పదిలంగానే ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు(175), అత్యధిక సిక్సర్లు(357) విధ్వంసకర బ్యాటర్ గేల్ పేరిట ఉన్నాయి. సిక్సర్ల రికార్డుకు ఇతర ఆటగాళ్లు చాలా దూరంలో ఉన్నా అత్యధిక స్కోరు రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఇప్పుడున్న ప్లేయర్లలో ఏ ఆటగాడు ఆ రికార్డు బ్రేక్ చేస్తారని భావిస్తున్నారు? COMMENT.

News March 22, 2025

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారికి రూ.1.20 లక్షల ఫైన్

image

కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు జగ్గంపేట సీఐ YRK శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగ్గంపేట గండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. శుక్రవారం జగ్గంపేట ఎస్సై రఘునాథరావు, గండేపల్లి ఎస్సై శివ నాగబాబు చేపట్టిన ఈ తనిఖీలలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 17 మంది పట్టుపడ్డారు. వీరిని కోర్టులో హాజరు పరచగా 12 మందికి రూ.10 వేల చొప్పున ఫైన్ విధించినట్లు సీఐ తెలిపారు.

error: Content is protected !!