News January 27, 2025
కాళేశ్వరం ఆలయ ఈఓ మారుతిపై వేటు

కాళేశ్వరం ఆలయంలో గత సోమవారం గర్భగుడి తలుపులు మూసేసి ప్రైవేట్ షూటింగ్ నిర్వహించడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారి దుమారంలేపింది. భక్తులు, ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టి విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆలయ ఈవో మారుతిపై వేటు వేస్తూ ఆలయ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తొలగిస్తూ దేవాదాయ శాఖ ఏడీసీ జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News December 9, 2025
ములుగు: అన్ని ఏర్పాట్లు చేయండి: EC

సజావుగా పంచాయతీ మొదటి విడత ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని అన్నారు. ఎన్నికల నిర్వహణపై హైదరాబాదు నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ దివాకర టిఎస్ పాల్గొన్నారు. కమిషనర్ మాట్లాడుతూ.. మొదటి విడతలో 3,834 పంచాయతీలకు, 27,628 వార్డులకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. గంట ముందు ఏజెంట్ల సమక్షంలో మాకు పోలింగ్ జరుగుతుందన్నారు.
News December 9, 2025
నక్కపల్లిలో పర్యటించిన జపాన్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ బృందం

జపాన్కు చెందిన నిప్పన్ స్టీల్ ప్లాంట్ ప్రతినిధుల బృందం మంగళవారం సాయంత్రం నక్కపల్లి మండలంలో పర్యటించింది. ఆర్సిలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ప్లాంట్కు ప్రభుత్వం కేటాయించిన భూములను పరిశీలించింది. ఇక్కడ ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్ కోసం బుచ్చిరాజుపేట, చందనాడ, డీఎల్పురం, రాజయ్యపేట, వేంపాడు పరిధిలో 2,164.31ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.
News December 9, 2025
ఏలూరు జిల్లా చరిత్రలోనే మొదటిసారి..!

ఏలూరు బార్ అసోసియేషన్ నుంచి మహిళా న్యాయవాది జిల్లా అదనపు న్యాయమూర్తిగా ఎంపికవడం తొలిసారి అని ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోనే సీతారామ్ పేర్కొన్నారు. జిల్లా అదనపు న్యాయమూర్తిగా ఎంపికైన గుంటూరు దుర్గాపూర్ణిమను అసోసియేషన్ న్యాయవాదులు మంగళవారం సాయంత్రం ఘనంగా సన్మానించారు. ఇది ఒక చరిత్రాత్మక ఘటన అన్నారు.


