News January 27, 2025

కాళేశ్వరం ఆలయ ఈఓ మారుతిపై వేటు

image

కాళేశ్వరం ఆలయంలో గత సోమవారం గర్భగుడి తలుపులు మూసేసి ప్రైవేట్ షూటింగ్ నిర్వహించడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారి దుమారంలేపింది. భక్తులు, ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టి విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆలయ ఈవో మారుతిపై వేటు వేస్తూ ఆలయ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తొలగిస్తూ దేవాదాయ శాఖ ఏడీసీ జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News February 24, 2026

NRPT: ఎత్తిపోతల పథకం భూ సేకరణకు క్యాబినెట్ ఆమోదం

image

సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూ సేకరణ కోసం నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపారు. మొదటి, రెండో దశ ప్రాజెక్టులతోపాటు డిస్ట్రిబ్యూటర్లకు భూ సేకరణకు రూ.1,275 కోట్లు కేటాయించేందుకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. మంత్రివర్గ ఆమోదంతో ఎత్తిపోతల పథకం పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉంది.

News February 24, 2026

RR: వేరుశనగ పంట వేశారా?

image

రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు టీసీజీఎస్-1694 ‘విశిష్ట’ వేరైటీ వేరుశెనగపై ఫీల్డ్ డే నిర్వహించారు. పూత దశలో తగిన నీరు, జిప్సం, జింక్ వినియోగంతో దిగుబడి పెరుగుతుందని డా.సంతోష్ కుమార్ సూచించారు. పంట విస్తీర్ణం, నాటే దూరం, సమతుల్య ఎరువుల వినియోగం, కలుపు నియంత్రణ, యాంత్రీకరణపై అవగాహన కల్పించారు. ఆకు తినే పురుగులు, వేరు పురుగుల నియంత్రణకు ఫెరోమోన్ ట్రాప్స్ వినియోగం వివరించారు.

News February 24, 2026

రేపు మార్కాపురం జిల్లాకు CM.. షెడ్యూల్ ఇదే.!

image

CM చంద్రబాబు బుధవారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన పర్యటన షెడ్యూల్‌ CMO అధికారులు విడుదల చేశారు. రేపు మధ్యాహ్నం 12:50కి దోర్నాలలోని వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేసి, పనులను పరిశీలించి మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉంటారు. మధ్యాహ్నం 2:30కి మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 4:40కి తిరిగి వెలగపూడికి బయలుదేరుతారు.