News February 5, 2025

కాళేశ్వరం కుంభాభిషేకం వాల్‌పోస్టర్ ఆవిష్కరణ

image

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం ఆలయం లో ఈనేలా 7 నుంచి 09 వరకు జరిగే మహా కుంభాభిషేకం వాల్ పోస్టర్లను దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ శ్రీధర్ వేరువేరుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణా రావు కార్యనిర్వహణాధికారి ఎస్. మహేశ్, ఉప ప్రధానార్చకులు పనకంటే ఫణింద్ర శర్మ పాల్గొన్నారు.

Similar News

News December 5, 2025

ఖమ్మం మార్కెట్‌కు రేపు, ఎల్లుండి సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు శని, ఆదివారాలు (డిసెంబర్ 6, 7) వారంతపు సెలవుల కారణంగా మార్కెట్ శాఖ అధికారులు సెలవు ప్రకటించారు. ఈ రెండు రోజుల్లో మార్కెట్‌లో క్రయవిక్రయాలు జరగవని తెలిపారు. తిరిగి ఈ నెల8వ తేదీ (సోమవారం) నుంచి క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని అన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు.

News December 5, 2025

తిరుపతి: ఆయిల్ ఫామ్‌తో ప్రయోజనాలివే.!

image

ఆయిల్ ఫాం ప్రపంచంలోనే అత్యధికంగా నూనె ఉత్పత్తి చేసే పంటని తిరుపతి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి తెలిపారు. ప్రతి ఎకరాకు సుమారు 4 మెట్రిక్ టన్నుల క్రూడ్ ఫామ్ ఆయిల్ అందిస్తుందని, ఇది ఇతర నూనె గుంజల పంటలతో పోలిస్తే 4నుంచి 10రెట్లు అధికంగా ఉంటుందని అన్నారు. ఒకసారి నాటిన తర్వాత ఆయిల్ ఫామ్ పంట 25 సంవత్సరాల వరకు రైతులకు నిరంతరం ఆదాయం ఇస్తుందన్నారు.

News December 5, 2025

చిత్తూరు: ‘తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలి’

image

పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. చిత్తూరు మండలంలోని తుమ్మింద జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం పోటీ తత్వం ఎక్కువగా ఉందని విద్యార్థులు రాణించాలంటే క్రమశిక్షణతో కూడిన పట్టుదల, కృషి అవసరమన్నారు.