News February 5, 2025
కాళేశ్వరం కుంభాభిషేకం వాల్పోస్టర్ ఆవిష్కరణ

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం ఆలయం లో ఈనేలా 7 నుంచి 09 వరకు జరిగే మహా కుంభాభిషేకం వాల్ పోస్టర్లను దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ శ్రీధర్ వేరువేరుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణా రావు కార్యనిర్వహణాధికారి ఎస్. మహేశ్, ఉప ప్రధానార్చకులు పనకంటే ఫణింద్ర శర్మ పాల్గొన్నారు.
Similar News
News February 15, 2025
మహిళా క్రికెటర్కు హీరో శివ కార్తికేయన్ సాయం!

తాము కష్టాల్లో ఉన్నప్పుడు సినీ నటుడు శివ కార్తికేయన్ చేసిన సాయాన్ని భారత మహిళా క్రికెటర్ ఎస్ సంజన గుర్తు చేసుకున్నారు. ‘2018 వయనాడ్ వరదల్లో ఇళ్లు కోల్పోయాం. నా ట్రోఫీలు, క్రికెట్ కిట్ కొట్టుకుపోయాయి. అప్పుడు శివ కార్తికేయన్ కాల్ చేసి హెల్ప్ కావాలా అని అడిగారు. కొత్త స్పైక్స్ కావాలని అడిగిన వారంలోనే అవి నా చెంతకు చేరాయి. అప్పుడు నా చుట్టూ ఎంత మంది మద్దతుదారులున్నారో తెలిసింది’ అని చెప్పుకొచ్చారు.
News February 15, 2025
కుంభమేళా సమయం పొడిగించండి: అఖిలేశ్

ప్రయాగ్రాజ్కు వస్తున్న భక్తుల రద్దీ దృష్ట్యా మహాకుంభమేళాను 75 రోజులకు పొడిగించాలని SP చీఫ్ అఖిలేశ్ యాదవ్ కోరారు. గతంలో ఒకసారి కుంభమేళా 75 రోజులపాటు జరిగిందని తెలిపారు. రద్దీ దృష్ట్యా 60 సంవత్సరాల పైబడిన వారు కుంభమేళాకు రాలేకపోతున్నారన్నారు. ఇప్పటివరకూ 60కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తే 50కోట్ల మంది వచ్చినట్లు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తోందని ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.
News February 15, 2025
జగిత్యాల: నోడల్ అధికారులకు కలెక్టర్ సూచనలు

ఎమ్మెల్సీ పోలింగ్ విధులపై నోడల్ అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, శిక్షణ తరగతుల్లో మాస్టర్ ట్రైనర్లను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ నెల 26న ఉదయం 8 గంటలకు ప్రిసైడింగ్ అధికారులు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకోని పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్స్లను క్షుణ్ణంగా పరిశీలించాలని, సంయమనంతో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు.