News February 9, 2025

కాళేశ్వరం: త్రివేణి సంగమం వద్ద భక్తుల పుణ్య స్నానాలు

image

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలో 42 ఏళ్ల తర్వాత మహా కుంభాభిషేక మహోత్సవాలు ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు జరుగుతున్నాయి. కాగా, భక్తులు కాళేశ్వరం గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరించి, ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ఈ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉ.10:42కు వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు.

Similar News

News October 15, 2025

జగిత్యాల: రేపటి నుంచి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

image

జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా బుధవారం నుంచి NOV 14 వరకు JGTL(D)లోని అన్ని గ్రామాల్లో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ప్రకాశ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రతి 6 నెలలకోసారి జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News October 15, 2025

జగిత్యాల: ‘విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి’

image

జగిత్యాల జిల్లా మహిళా సాధికారత ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ సాంఘిక గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సంక్షేమ అధికారి డా. బోనగిరి నరేష్ పాల్గొన్నారు. మాట్లాడుతూ.. సోషల్ మీడియా, ఫోన్‌లకు దూరంగా ఉంటూ, మంచిని మాత్రమే గ్రహించాలని ఆయన సూచించారు.

News October 15, 2025

HYD: సెల్ ఫోన్ డ్రైవింగ్.. 80 వేల కేసుల నమోదు

image

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సెల్ ఫోన్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. డ్రైవింగ్ సమయంలో ఫోన్ వాడకుండా సీపీ హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి. జనవరి 1 నుంచి అక్టోబర్ 12 వరకు 80,555 కేసులు నమోదు కాగా, అక్టోబర్ 13 నుంచి మంగళవారం వరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో మరో 2,345 కేసులు నమోదైనట్లు తెలిపారు. No Call Is More Important Than a Life అంటూ ప్రచారం చేస్తున్నారు.