News February 9, 2025
కాళేశ్వరం: త్రివేణి సంగమం వద్ద భక్తుల పుణ్య స్నానాలు

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలో 42 ఏళ్ల తర్వాత మహా కుంభాభిషేక మహోత్సవాలు ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు జరుగుతున్నాయి. కాగా, భక్తులు కాళేశ్వరం గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరించి, ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ఈ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉ.10:42కు వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు.
Similar News
News October 18, 2025
HYD నుంచి శ్రీశైలానికి గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం

HYD నుంచి శ్రీశైలానికి 147 కిలోమీటర్ల మేర గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలిపింది. రావిర్యాల నుంచి ఆమన్గల్, ఆమన్గల్ నుంచి మన్ననూరు వరకు దీనిని నిర్మించి, అక్కడి నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. ఫ్యూచర్ సిటీలో భాగంగా HMDA నిర్మిస్తోన్న రావిర్యాల-ఆమన్గల్ కొత్త రోడ్డును దీనికి అనుసంధానించనున్నారు.
News October 18, 2025
HYD నుంచి శ్రీశైలానికి గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం

HYD నుంచి శ్రీశైలానికి 147 కిలోమీటర్ల మేర గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలిపింది. రావిర్యాల నుంచి ఆమన్గల్, ఆమన్గల్ నుంచి మన్ననూరు వరకు దీనిని నిర్మించి, అక్కడి నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. ఫ్యూచర్ సిటీలో భాగంగా HMDA నిర్మిస్తోన్న రావిర్యాల-ఆమన్గల్ కొత్త రోడ్డును దీనికి అనుసంధానించనున్నారు.
News October 18, 2025
ఈనెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లు

AP: రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 10,700 మంది సిబ్బందితో సన్నాహాలు చేస్తున్నాం. 51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు మిల్లర్లు పనిచేయాలి. ధాన్యం 24 గంటల నుంచి 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తాం’ అని తెలిపారు.