News February 16, 2025

కాళేశ్వరం: మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

image

మహా శివరాత్రి పురస్కరించుకొని కాళేశ్వరం పుణ్య క్షేత్రానికి మంథని డిపో నుంచి మంథని-కాళేశ్వరానికి 26 బస్సులను నడిపించనున్నట్లు KNR RM బి.రాజు ఒక ప్రకటనలో తెలిపారు. భక్తుల రద్దీని బట్టి కరీంనగర్, గోదావరిఖని డిపోల నుంచి అదనపు బస్సులను నడిపిస్తామన్నారు. అలాగే వేలాల క్షేత్రానికి గోదావరిఖని డిపో నుంచి GDK-వేలాలకు 56 బస్సులు, మంథని డిపో నుంచి మంథని-వేలాలకు 40 బస్సులు నడిపిస్తామన్నారు.

Similar News

News September 17, 2025

తిరుపతిలో బిల్డింగ్‌‌పై నుంచి పడి విద్యార్థి మృతి

image

తిరుపతి నగరంలో విషాదం నెలకొంది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాసపురంలో బిల్డింగ్‌పై నుంచి పడి విద్యార్థి చనిపోయాడు. మృతుడు తమిళనాడు రాష్ట్రానికి చెందిన స్టీఫెన్‌గా గుర్తించారు. అంబేడ్కర్ లా కాలేజీలో 4వ సంవత్సరం చదువుతున్నాడు. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు పడిపోయాడా? అనేది తెలియాల్సి ఉంది.

News September 17, 2025

విలీనం కాకపోతే TG మరో పాక్‌లా మారేది: బండి

image

TG: సర్దార్ వల్లభాయ్ పటేల్‌ లేకపోతే తెలంగాణకు విముక్తి కలిగేది కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘భారత్‌లో TG విలీనం కాకుంటే మరో పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లా ఆకలి కేకలతో కల్లోల దేశంగా మారేది. జలియన్ వాలాబాగ్‌ను మించి పరకాల, బైరాన్‌పల్లి, గుండ్రాంపల్లిలో రజాకార్లు రక్తపాతం సృష్టించారు. ఈ దురాగతాలను చరిత్రకారులు విస్మరించారు. రాష్ట్ర ప్రభుత్వం విమోచన ఉత్సవాలను నిర్వహించాలి’ అని డిమాండ్ చేశారు.

News September 17, 2025

నూతనకల్: సామన్య ప్రజలతో గడీపై దాడి

image

తెలంగాణ సాయుధ పోరాట సమయంలో నూతనకల్ మండలం ఎర్రపహాడ్‌కి చెందిన జెన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి దేశ్ ముఖ్ ఆధీనంలో లక్షా 50 వేల ఎకరాల భూమి ఉంది. ఎర్రపహాడ్‌లో సువిశాలమైన గడీలో రజాకార్లు ఉండటాన్ని పసిగట్టిన దాయం రాజిరెడ్డి, భీంరెడ్డి కొండల్ రెడ్డి దళాల నాయకత్వంలో ప్రజలను పోగుచేసి బాంబులతో గడీలపై దాడి చేశారు. ఇప్పటికీ ఆ గడీ అలానే ఉంది.