News February 16, 2025

కాళేశ్వరం: మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

image

మహా శివరాత్రి పురస్కరించుకొని కాళేశ్వరం పుణ్య క్షేత్రానికి మంథని డిపో నుంచి మంథని-కాళేశ్వరానికి 26 బస్సులను నడిపించనున్నట్లు KNR RM బి.రాజు ఒక ప్రకటనలో తెలిపారు. భక్తుల రద్దీని బట్టి కరీంనగర్, గోదావరిఖని డిపోల నుంచి అదనపు బస్సులను నడిపిస్తామన్నారు. అలాగే వేలాల క్షేత్రానికి గోదావరిఖని డిపో నుంచి GDK-వేలాలకు 56 బస్సులు, మంథని డిపో నుంచి మంథని-వేలాలకు 40 బస్సులు నడిపిస్తామన్నారు.

Similar News

News March 25, 2025

కలెక్టర్ల సమావేశంలో మంత్రి సంధ్యరాణి

image

CM చంద్రబాబు నాయుడు అధ్యక్షతన విజయవాడలోని సచివాలయంలో 3వ జిల్లా కలెక్టర్ల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో సహచర మంత్రివర్గంతో రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

News March 25, 2025

రేపు భైంసాలో ఎస్పీ ఫిర్యాదుల విభాగం

image

పోలీసులు మీకోసంలో భాగంగా బుధవారం భైంసా క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఫిర్యాదుల విభాగం నిర్వహించనున్నట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. భైంసా సబ్ డివిజన్లో ఉన్న ఫిర్యాదుదారులు నేరుగా ఆమెను కలిసి ఫిర్యాదులు అందజేయవచన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News March 25, 2025

టికెట్ ధరల పెంపుపై ‘రాబిన్ హుడ్’ టీమ్ ప్రకటన

image

కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో మినహా ఏపీ, తెలంగాణలో టికెట్ ధరల పెంపు లేదని రాబిన్ హుడ్ మూవీ యూనిట్ తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. టికెట్ ధరల పెంపుపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది. అభిమానులకు సరసమైన ధరలకే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. సమీప థియేటర్లలో ఈ నెల 28న రాబిన్ హుడ్ సినిమా చూసి ఆనందించాలని కోరింది.

error: Content is protected !!