News March 29, 2025

కాళేశ్వరం: సరస్వతి పుష్కరాలకు నీటి కష్టాలు!

image

మే 15 నుంచి 26 వరకు సరస్వతి నదీ పుష్కరాలు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కాళేశ్వరం వద్ద రూ.25 కోట్ల నిధులతో పనులు జరుగుతున్నాయి. కాగా ఎండ తీవ్రత కారణంగా గోదావరిలో నీరు తగ్గుముఖం పడుతోంది. పుష్కరాల కోసం ప్రభుత్వం పుష్కరాల కోసం ముందస్తు చర్యల్లో భాగంగా డ్యాం వద్ద సిమెంట్ బ్యాగులతో ఇసుక నింపి దిగువ గోదావరికి అడ్డుగా వేస్తే నీరు నిల్వ ఉండే అవకాశం ఉంది.

Similar News

News November 23, 2025

యువకులు గల్లంతుపై ఇన్‌ఛార్జి మంత్రి ఆరా

image

కొమరాడ మండలం జంఝావతి రబ్బరు డ్యాంలో ముగ్గురు యువకులు గల్లంతుపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. సివిని గ్రామానికి చెందిన యువకులని మంత్రికి వివరించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించినట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించినట్లు తెలిపారు.

News November 23, 2025

వేగంగా కోలుకుంటున్న శ్రేయస్

image

ఆసీస్‌తో ODI సిరీస్‌లో గాయపడిన శ్రేయస్ అయ్యర్ వేగంగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యంపై PBKS కో ఓనర్ ప్రీతిజింటా అప్డేట్ ఇచ్చారు. ఆ జట్టు ప్లేయర్ శశాంక్ సింగ్ బర్త్‌డే పార్టీలో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. శ్రేయస్ అద్భుతంగా రికవరీ అవుతూ బయటకు రావడం సంతోషంగా ఉందన్నారు. కాగా SAతో ODI సిరీస్‌కు అతను ఇప్పటికే దూరమయ్యారు. జనవరిలో NZతో జరిగే వన్డేలకు అందుబాటులోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

News November 23, 2025

కొమరాడ: రబ్బర్ డ్యాంలో ముగ్గురు గల్లంతు

image

కొమరాడలోని జంఝావతి నదిపై ఉన్న రబ్బర్ డ్యాంలో ఆదివారం సాయంత్రం స్నానానికి దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని శివిని గ్రామానికి చెందిన గోవింద నాయుడు, సంతోష్ కుమార్, అరసాడ్ ప్రదీప్‌లు రబ్బర్ డ్యాంను చూసేందుకు వచ్చి స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఎస్సై నీలకంఠం తెలిపారు.