News March 29, 2025

కాళేశ్వరం: సరస్వతి పుష్కరాలకు నీటి కష్టాలు!

image

మే 15 నుంచి 26 వరకు సరస్వతి నదీ పుష్కరాలు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కాళేశ్వరం వద్ద రూ.25 కోట్ల నిధులతో పనులు జరుగుతున్నాయి. కాగా ఎండ తీవ్రత కారణంగా గోదావరిలో నీరు తగ్గుముఖం పడుతోంది. పుష్కరాల కోసం ప్రభుత్వం పుష్కరాల కోసం ముందస్తు చర్యల్లో భాగంగా డ్యాం వద్ద సిమెంట్ బ్యాగులతో ఇసుక నింపి దిగువ గోదావరికి అడ్డుగా వేస్తే నీరు నిల్వ ఉండే అవకాశం ఉంది.

Similar News

News November 27, 2025

అటు అనుమతి, ఇటు విరాళం.. టాటా గ్రూపుపై సంచలన ఆరోపణలు!

image

BJPకి టాటా గ్రూపు లంచం ఇచ్చిందంటూ సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ సంచలన ఆరోపణలు చేశారు. టాటా గ్రూపు, BJPపై scroll.in రాసిన కథనాన్ని షేర్ చేశారు. ‘సెమీకండక్టర్ యూనిట్లకు మోదీ క్యాబినెట్ ఆమోదం తెలపగానే BJPకి అతిపెద్ద దాతగా టాటా గ్రూపు ఎలా మారింది? 2 యూనిట్లకు సబ్సిడీ కింద ₹44,203Cr టాటాకు వస్తాయి. క్యాబినెట్ అప్రూవల్ వచ్చిన 4 వారాలకు ₹758Crను BJPకి విరాళంగా ఇచ్చింది. ఇది లంచం’ అని ట్వీట్ చేశారు.

News November 27, 2025

BCల రిజర్వేషన్లు తగ్గించలేదు: సీతక్క

image

TG: సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అనుసరించి 50% రిజర్వేషన్ పరిమితిని తప్పనిసరిగా పాటించాల్సి వచ్చిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ‘కొన్ని మండలాల్లో SC, ST జనాభా ఎక్కువగా ఉండటంతో BC రిజర్వేషన్లలో కొంత మార్పు జరిగింది. ఎక్కడా BCల రిజర్వేషన్లు తగ్గించలేదు. సర్పంచుల రిజర్వేషన్లకు మండలాన్ని, వార్డు సభ్యులకు గ్రామాన్ని, ZPTCలకు జిల్లాను, ZP ఛైర్మన్లకు రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకున్నాం’ అని తెలిపారు.

News November 27, 2025

BREAKING: ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్‌ను పట్టుకున్న ACB

image

ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు, అతని డ్రైవర్ భూమేష్ (ప్రైవేట్ వ్యక్తి)ని గురువారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కొత్త ఇంటికి నంబర్ కేటాయింపు విషయంలో కమిషనర్ రూ.20 వేలు లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమిషనర్ ఇంటి వద్ద డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. డ్రైవర్ బ్యాగును తనిఖీ చేయగా అందులో అదనంగా రూ.4.30 లక్షలు లెక్కల్లో చూపని నగదు దొరికింది.